పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

నారదుఁడు తత్త్వవిద్యావిశారదుండు
నానతి యొసంగె నట్లనె యఖిలజనులు
దైవవశమున నుండఁగఁ దగునుపాయ
ములు వృథాయగు వంధ్యారతులను బోలె.

132


ఆ. వె.

నీవు దక్క నాకు నిక్కంబు పతి లేఁడు
సాలసాలమూలసంప్రవేశి
యైన విప్రు నీకులాంగన చంపక
యుండెనేని తె మ్మఖండమహిమ.

133


తే. గీ.

పావకుండును జలమును బాహ్మణుండు
భర్త లరయంగ జగతిలోఁ బరిణయమున
కట్లు గాన కుశజలానలాదికంబు
లొనరకుండిన బ్రాహ్మణుం డొకడు చాలు.

134


మ.

దనుజాధీశవతంస! నేఁడు సుముహూర్తంబైన హోమాంతరం
బున విప్రున్ భజియింపు మీ వనిన నా పూవిల్తుఁ డేయన్ రయం
బున నేఁగెన్ ఫలియించుఁబో మనసులోఁ బూర్జంబులౌ కోర్కు లా
ఘనవిప్రున్ మడియించునో యిపుడు మత్కంజాక్షి గర్వోద్ధతిన్.

135


మ.

అని చింతించుచు నేఁగుచో నదరె నవ్యంబైన నే త్రంబు స
య్యన నాత్మక్షుత ముద్భవించె, నిజదేహాకీర్ణమౌ నంబరం
బును నేలం బడియెన్ నగాగ్రమున నిప్పుల్ గ్రక్కె ఘూకంబు ప్ర
త్యనిలంబుల్ పలుమాఱు వీచె నశుభంబై తోఁచెఁ గ్రవ్యాశికిన్.

136


సీ.

అవి యన్నియును నాదురాత్మకుఁ డాత్మలో
                       గణన సేయక వచ్చి కామనీయ
కస్ఫూర్తి మానుషకాంతయై భర్తృభా
                       ర్యాభావములను బ్రాహ్మణుఁడుఁ దాను
జోకయై మద్భర్త క్షుద్రుండు సంతత
                       పాపశీలుండు సపత్నిఁగాఁగ
నొకబాలరాజకన్యక నెత్తుకొని వచ్చి
                       యున్నవాఁ డతని నే నొల్ల ననుచు