పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అన మదిరాక్షి మధురోక్తుల నిట్లనియె: భవిష్యద్భారత పురాణంబున
హిడింబియను రాక్షసి భీమసేనుండను పాండవునకు భార్య గాఁగలదు.
అతనికంటె బలాధికుండైన ఘటోత్కచుండను తనయుండు జనియింపఁ
గలండు. వాని నేశస్త్రంబుల వధింపఁ దరంబు గాదు. ఇంద్రశక్తిచేత
సాధ్యుండు గాఁగలఁడు. ఆశక్తి పూర్వంబున వైరోచనిజిఘాంసచే
నింద్రుండు మధ్యమలోకంబునకుఁ జని శౌర్యంబున నాశక్తిఁ దెచ్చి
సాలాగ్రంబున నుంచిన వాఁడదె యమర్త్యుని పైనేనిఁ బ్రయోగించిన
మృతుండు గావలయు నది మత్పతి సాలాగ్రంబున నిడినవాఁడు అది
నేఁ దెచ్చెద నది రాక్షసుపై ప్రయోగించితివేని యతం డీల్గిన మన
మన్యోన్యప్రేమాతిశయంబు లనుభవింపఁగలము. కాదేని వాఁడు
నిన్ను భక్షించు. నన్ను సపత్నీదుఃఖంబునం బొరలించుం గావున నీ
యత్నంబుం దలంపు. నే ననృతంబు పలికితినేని జన్మార్జితపుణ్యంబులు
దొలంగు, బ్రహ్మహత్యాపరులపాపంబు నొందుదు, మద్యపానం
బొనర్చిన దురాత్ములైన బ్రాహ్మణులదురితంబు నొందుదు, స్వర్ణ
రత్నమే దిన్యవహారంబులు చేసినవారి దుష్కృతంబుఁ గాంతు,
ఆత్మహననంబు చేసినవారి దుర్గతిం బాయుదు, పంచమియందు గర్గరీ
రవం బొనర్చిన స్త్రీల కిల్బిషంబుఁ జెందుదు. నవమిం దరుచ్ఛేదంబు
చేసినవారి దుష్కర్మంబునకు లోనైయుండుదు. పర్వంబుల స్త్రీ
సంగమంబు చేసినవారి వృజినంబులకు లోనగుదు. ఎవ్వఁ డుచ్చిష్ట
సమయంబున ఘృతంబు వోయించుకొని భుజించు నెవ్వఁడు ఘృతంబు
వ్రేలం బట్టి యాస్వాదించు నెవ్వఁడు దివారతం బొనర్చు వారి కల్మ
షంబులకు నాలయంబై వర్తింపుదు. గృహస్థుండై వైశ్వదేవంబు
సేయక భుజియించి భిక్షుకులకు భిక్ష యొడంబడి పరిహరించినవారి
యఘంబునకు నాటపట్టై కనుపట్టుదు. సంక్రమణంబునఁ దైలస్నానంబు,
గోవులచేతఁ దీర్ఘవ్రజనంబును, బరోదపానంబునందుఁ బంచమృత్తికా
పిండోద్ధరణంబు సేయక స్నానంబు చేసినవాని యంహువారంబులకుఁ
జేరిక యగుదు. కుశకాశతృణంబులుదక్క శుష్కకాష్ఠంబుల దంత
ధావనంబు చేసినపంకం బనుభవింపుడు. నిజగృహంబున మొదవుం
గట్టి తృణజలంబులం బోషించనివాని యేనంబులం జేకొందు. దేవార్చన
యందుఁ బైతృకంబునం గాష్ఠాసనంబున నుండి యెవ్వఁ డాచరించు వాని