పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఈరీతి ఘోషార్భటి మ్రోయఁ బాపం బొనర్చితినేని నీలవస్త్రాచ్చాది
తంబై తత్పటహంబు మలినంబగు. తా నార్జించినయశంబు తానే
యడంచిన క్రిమికీటకజుష్టంబై విష్ణాశయంబైన సూకరయోనిం బది
రెండుయుగంబులు జన్మించు. హరివాసరంబున భుజించినవాఁడు
దురాత్ముండు, పాపమతి, కుకర్ముండు. వాఁడు జనింపనేల? మీది
దివ్యశాస్త్రము గాదు. హరివాసరంబున భుజింపుమనువారు సత్పురుషులు
గారు; భుజింపుమనినవి స్మృతులు గావు; వేదములు గావు. నాఁడు
పైతృకం బాచరించినఁ బితృశేషంబు భుజించినఁ బితృతృప్తి లేదు. వైవ
స్వతుండు సలేఖుండై దూతబలోపపన్నుండై హర్షంబు నొందు ననిన.

70

మోహిని రుక్మాంగదుని నిందించుచు వెడలుట

సీ.

ఆమాట లాలించి యారక్తనయనయై
                       ధర్మబాహ్యుఁడ వైతి ధరణినాథ!
పాంశువు తద్ధర్మబాహ్యుండు సరియని
                       తలఁచిన నేమి తత్పాంశుచయము
ఘనగర్తఖననంబు గావింప బుద్ధిత
                       ద్గర్తపూర్తికి నధికతర మదియె
నీదు ధర్మంబు గాన్పించె నీ కుపధాన
                       మేఁ జేయ నాభుజ మింక నధిప!

!

తే. గీ.

సత్య ముడిగి దురాచారసరణిఁ దిరుగ
మ్లేచ్ఛుఁడవుగావు; నీతియే మ్లేచ్ఛబుద్ధి
నడువ? నిక్ష్వాకువంశైకనాథ! నేను
నిన్ను విడిచితిఁ బోయెదఁ గన్నయెడకు.

71


వ.

ఇట్లు పలుకుచు వేగంబున లేచి యాక్రోశంబు సేయుచు గౌతమాదిభూ
సురులుం దానును మదిరాపానంబు మేలు రాజు సంగంబునకంటె;
మలసంకరణంబు మేలు భూపతి సమాగమంబునకంటె; నీలాంబర
స్పర్శనంబు మేలు మూఢుని కూటమికంటె ; నుదక్యాసంసృష్టి
మేలు దురాచారుని కేళికంటె ననుచు బాహ్యసీమకుం జనియె నప్పుడు
ధర్మాంగదుండు చనుదెంచి యిట్లనియె.

72