పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహిని బ్రాహ్మణుల రావించుట

మ.

అతిరోషంబున ఘూర్ణికం బిలిచి నెయ్యం బొప్ప మన్నించి యా
శ్రితవిప్రావళిఁ గూర్చి యాసనసుఖాసీనాత్ములం జేసి సు
వ్రతలీలాధికులైన యాఘనులకున్ పశ్యక్రియన్ మ్రొక్కి స
మ్మతితో వృద్ధుని గౌతముం గనిన ధర్మజ్ఞుం డతం డిట్లనున్.

55


క.

“పిలిచితి వేటికి నిపు డో
యలికుంతల! నీదు సంశయము దీర్చగ స
త్కులశీలవ్రతులగు వి
ప్రులు వచ్చిరి వీరె పూర్వపుణ్యముకతనన్."

56


వ.

అనిన మోహిని యిట్లనియె: హరివాసరంబున భుజింప నొల్ల నని
యెడి నీరాజు స్థావరజంగమాత్మకంబైన యీజగంబునకు నన్నంబె
జీవనంబు. పితృగణంబేనియు నన్నంబున హర్షించు. కర్కం
ధూమాత్రపురోడాశంబుననే దేవతలు ప్రమోదింతు రన్నమే యమృతం
బని యాకాంక్షింతురు. పిపీలికాగణంబులు తండులకణంబులు గొని
దుఃఖంబున బిలంబు చొచ్చు నన్నం బెవ్వరికిఁ బ్రియంబు గాదు? రాజా!
నీధర్మంబు వదలి యతిధర్మంబు గైకొన్నవాఁ డవవ్రతయైన విశ్వ
స్తయు నవ్రతుండైన యతియు నంధతమసంబునం జతుర్దశేంద్ర
పర్యంతంబు వర్తింపుదురు. రాజులకు రాజ్యపరిపాలనంబు దక్క
నితరధర్మం బర్హంబె? స్త్రీలకు భర్తృశుశ్రూషయుఁ బుత్రులకుఁ బితృ
సేవనంబును శూద్రులకు ద్విజపూజనంబును రాజులకు లోకరక్షణం
బును ధర్మంబులు. ఇట్టి ధర్మంబులు ప్రమోదాజ్ఞానంబున వదలినఁ
బతితుండగు. అవ్యాపారయగు యువతియు, నవినీతుండగు సుతుం
డును, భృత్యమంత్రివివర్జితుండై యేకాంతశీలుండగు రాజును నప్ర
తిష్ఠతో నరకంబు గాంతురు. అన్నంబునఁ బ్రాణంబును, బ్రాణంబునఁ
జేష్టయుఁ, జేష్టచే రిపునాశనంబు సేయ శక్తుండు నగు. ఇట్టి యన్నంబు
విడిచిన క్షీణదేహుండై యేకార్యం బొనర్పనేర్చు ననిన:

57


క.

తద్వాక్యము విని యపు డా
విద్వాంసులు తథ్య మనుచు వివరించి మహీ
భృద్వేదండము శాస్త్రో
ద్యద్వచనాంకురము చూసి యనిరి ప్రియమునన్.

58