"పరమార్థం బెఱుంగలేక యల్పశ్రుతులైనవారు మదర్థం బితిహాస
పురాణస్మృతినిర్ణీతం బైనదానిం జెఱుతు" [3]రని వేదంబులు పలుకు.
వేదంబునందు గ్రహసంచారంబును లగ్నశుద్ధియుఁ దిథివృద్ధిక్షయం
బులుఁ గాన్పింపవు; యాజ్యాయాజ్యులు నేర్పడరు; బ్రహ్మహత్యాదు
లకుఁ బ్రాయశ్చితాదులు నిర్ణయింపబడవు. అంగంబుల నెయ్యది
దీపించు నుపాంగంబుల నెయ్యది గాన్పించు స్మృతిపురాణంబుల
నెయ్యది ప్రకాశించు నదియ వేదంబులు నుచ్చరించుం గావున:
“నభోక్తవ్యం నభోక్తవ్యం సంప్రాప్తే హరివాసరే
పురాణమన్యథాకృత్వా తిర్యగ్యోని మధా౽ప్నుయాత్”
అని మొఱ్ఱ వెట్టుచున్నవి. పితృమాతృనింద సేయుకంటెను,
గంగాస్నానంబు సేయకయుండునంతకంటెను, హరివాసరంబున
భుజియించునంతకంటెను, దేవబ్రాహ్మణులదూషణంబు సేయునంత
కంటెను, బ్రహ్మహత్య గావించునంతకంటెను, పరదారాభిగమనంబు
గావించునంతకంటెను మహాపాపంబుఁ గావింప నెవ్వరితరంబు? అని
యెఱింగి హరివాసరంబున భుజియింపనేర్తునే? అనిన.