పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

సత్యహీనసురాపాయిజనులలోన
నాసురాపానరతులకు సమరవరులు
నిష్కృతి వచించి రనృతోక్తినిరతుఁడైన
నీచునకు నిష్కృతి వచింపనేరరైరి.

48


వ.

అనిన రుక్మాంగదుం డిట్లనియె: గౌతముండు గృహస్థునకు నేకాదశ్యుప
వాసంబు వలదని పలికెనంటివి. అతండు క్షుద్రశాస్త్రానుసారంబునం
బలికిన నేమి? పురాణంబులందు నిర్ణయంబు గలదు. శంఖంబుతో
జలంబు ద్రావుట, కూర్మసూకరమాంసంబులు భక్షించుట పాపంబులని
తెలియంబడియె నేకాదశి భోజనంబును నగమ్యాగమనంబును నభక్ష్య
భక్షణంబును నకార్యకరణంబును గోసహస్రవధతుల్యం బని
యెఱింగించె. ఏకాదశి నర్హంబె భుజింప? ఏకాదశిని బురోడాశంబును
భుజియింపంగాదు. క్షీణులకు మూలఫలపయస్సోమపానంబును,
జ్వరితులకు లంఘనంబును, బాపులకు నుపవాసంబును ప్రశస్తం బను
నొకకల్పంబు గలదు. మలప్రకోపంబున హరివాసరంబు వచ్చిన
భుజింపందగదు; జ్వరమధ్యకృతపథ్యభోజనంబు సేయందగదు.
చేసిన నరకంబు నొందుఁ గావున నాగ్రహంబు విడువు మిదిగాక మఱి
యొకటి యెుయ్యేదియేనియు రుచించినం జేసెద ననిన మోహిని
యిట్లనియె.

49


క.

అవనీశ! ప్రాణ మిచ్చినఁ
జవి యగునే? యేను నీవు సల్లాపములన్
నవశాల్యోదనఫలరస
వివిధరుచుల్ గొని భుజించి వెలయకయున్నన్.

50


తే. గీ.

రాజశేఖర! హరివాసరవ్రతంబు
ఘనత వేదోపదిష్టంబు గాదు విప్రు
లగ్నిమంతులు వర్తింప రావ్రతమున
వేదబాహ్యమతం బేల విస్తరింప?

51


వ.

అనినం గనలి రాజేంద్రుం డిట్లనియె.

52