పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

యట్లగుట నీజలాధీశ్వరాగ్రపుత్రిఁ
గాంచి కరుణించి నీయిచ్చ గలిగినట్ల
యిమ్ము పంకజసంభవహితకుమారి
కగ్రదాసిగ మన్నించి యవనినాథ.

320


వ.

అనిన విని మాంధాత యిట్లనియె.

321


తే. గీ.

కొడుకుమాటలు విని రాజకుంజరుండు
మోహినియు నేమి తలఁచిరి మునివరేణ్య
చిత్రతరమైన యీ కథాసూత్ర మెల్ల
నీముఖంబున విన బుద్ధి నేఁడు పొడమె.

322


వ.

అనిన వసిష్ఠుం డిట్లనియె.

323

ధర్మాంగదుని వివాహము

శా.

ఆనీతాద్భుతపుత్రసంపదలు నెయ్యం బంది వీక్షించి ని
త్యానందంబు వహించి భూవిభుఁడు శౌర్యస్పూర్తిసత్కీర్తి ల
క్ష్మీనిత్యోన్నతి ధాత్రి నాజ్ఞ నడిపించెన్ వీఁడు సత్పుత్రుఁ డ
న్యూనజ్ఞాననిధాన మాఢ్యతరుఁ డర్హుం డంచు నూహింపుచున్.

324


క.

అసమకళ సుదిన[1]సుముహూ
ర్తసువిధునక్షత్రతిథుల ధరణిపు లెంచన్
స్వసుతునకు వివాహము సే
య సువిప్రులఁ బిలిచి ధన్యుఁడై పూజించెన్.

325


వ.

పూజించి గోనిష్కసహస్రంబు లొక్కాక్కని కిచ్చి యనిచి
నిజపురోహితునిం జూచి యిట్లనియె.

326


గీ.

యౌవనోపేతుఁడగు పుత్రు నాత్మజనకుఁ
డర్థ మబ్బియును వివాహ మాచరింప
కున్న నాతఁ డగమ్యమై యున్న దుర్ని
రయముల వసింపుచుండు యుగాయుతంబు.

327


వ.

అది గావున బాల్యంబుననే వివాహంబు సేయుట పితృకృత్యంబు
సుతుని నిర్వహించుట తన్ను నిర్వహించుకొనుట. సుతుండు కృత

  1. సుముహూర్త సుఁడు సునక్షత్ర సుతిథుల