|
(యందఱును) గృహంబుల సత్యధర్మపరులై యఖిలభోగంబులు
ననుభవింపుదురు. భూమి దున్నక పండు. శిశువులకుఁ జనుబాలపుష్టి
గలదు. స్త్రీలు భర్తృభోగ[1]కలిత లగుదురు. స్వరాష్ట్రగుప్తిని
రాజులు హర్షంబు నొందుదురు. [2]ధేనువులు గోపకులు గాయక
స్వేచ్ఛాసంచారంబు చేసి వత్సక్రియలై పాలు గురియుచు [3]నిల
(య)౦బులకు వచ్చు నిట్లు రామరాజ్యప్రకారంబున నుండు నంత.
| 311
|
రుక్మాంగదుఁడు మోహినితో సుఖించుట
క. |
ఇది దిన మిది రే యిది క్షణ
మిది జా మిది పక్ష మనుచు నెఱుఁగక భోగా
స్పదమగు పదమన నావిభుఁ
[4]డెదమాడి సుభోగభోగ మెసఁగ [5]రమించెన్.
| 312
|
శా. |
ఆరామామణితో రమించి రవివంశాధీశుఁ డత్యంతతే
జోరమ్యత్వదృఢత్వసత్వబహువస్తుత్వంబులన్ శుక్లప
క్షారూఢద్విజరాజువోలె నుదయం బందెన్ వధూనృత్తగీ
తారంభంబులు గాంచి తద్వనితయాస్యస్ఫూర్తి వీక్షింపుచున్.
| 313
|
క. |
వరకుంభికుంభపీనాం
తరనీరంధ్రాతివృత్త[6]తత్కుచము లురోం
తరమున రాయుచు ధరణీ
ధరవల్లభుఁ డమితమోహతత్పరుఁ డయ్యెన్.
| 314
|
క. |
ఆరోమరేఖ యాసొగ
సారుచిరనితంబబింబ మాయొయ్యారం
బౌరా! రాజీవభవుం
డేరీతిం జేసెనో సమిద్ధత దీనిన్.
| 315
|
- ↑ కలితు లగుదురు
- ↑ ధేనువుల
- ↑ నిలంబులకు వచ్చుచు నిట్లు
- ↑ డిదమాది సుభోగ
- ↑ రచించెన్
- ↑ తత్కుచములు దొంతరమున