పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

జిందులాడెడు నెవ్వండు సిరి వహించి
సవతితోఁ బ్రాణనాథుఁ డశ్రాంతగోష్ఠి
సలువ నేకాంత యేకాంతసదనసీమ
నిలిచి చూడంగనోపు నో నృపకుమార!

299


వ.

అదియునుం గాక సర్వదుఃఖంబులకు నిదియ దుఃఖతరంబని పల్కిన
ధర్మాంగదుఁ డిట్లనియె.

300


తే. గీ.

కలుషశీలత వాఙ్మనఃకాయకర్మ
హితము సేయక తండ్రికి నెగ్గొనర్చు
నెవ్వఁ డాతఁడు నాశత్రుఁ డెంచ వధ్యుఁ
డరయ సంధ్యావళీసతి యైన నేమి?

301


క.

అందఱిలో నీమోహిని
మందరనగసీమనుండి మనుజేశసుఖా
నందకరప్రియశీలతఁ
జెందినయది గాన హితము సేయఁగవలయున్.

302


సీ.

అనినఁ బుత్రునిమాట లాలించి జననులం
                       దఱును లాలించి గద్గదమనోహ
రోక్తుల నీమాట యోగ్యంబు న్యాయసం
                       యుత మవశ్యముఁ జేయ యుక్త మనఘ!
కించిద్ధనం బొసంగి భవద్గురుండును
                       మోహినీకేళిఁ గ్రమ్ముకొనుఁగాత
అఖిలభోగంబులు ననుభవించి మనంబు
                       దృప్తిఁ జెందినయది తెలియనేల


తే. గీ.

వాసి కెక్కి ద్వితీయవివాహమునకుఁ
గూడి ప్రథమపరిణయద్విగుణధనంబు
లోలి సేయంగఁ దగుఁ గాకయున్న జ్యేష్ఠ
భార్య కాభర్త ఋణికుఁడై పరఁగియుండు.

303


క.

పుత్రేచ్ఛ నన్యనీరజ
నేత్రం బరిణయము నంద నెక్కొని కరుణా
పాత్రంబగు జ్యేష్ఠకు ధన
మత్రత్యులు మెచ్చ ద్విగుణ మర్పింపఁదగున్.

304