పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

పానద్యూతసుఖం బది
యేనో మూలంబు దాని నే నొల్లన్ ద
త్పానద్యూతాసక్తమ
హీనుఁడు హీనుండు నరక మిది యద్భుతమే.

121


శా.

ఆఖేటాటనకేలిమై నిఁక నరణ్యానీ నదీ రాజధా
నీ ఖేటర్షి పరాక్రమాది తతులన్ వేష్టింతు భావత్కదో
శ్శాఖన్ భారము నిల్పి కాంచెద నశేషన్వేష్టభోగంబు లే
నీష్ఖేదంబున నున్న నాకు నిరయం బీమీదఁ బ్రాపించెడిన్.

122


వ.

అనిన ధర్మాంగదుం డిట్లనియె.

123


సీ.

అఖిలభోగంబులు ననుభవింపుఁడు సుదు
                       ర్ధరధరాభార మిద్ధరణిఁ దాల్చు
తావకవాక్యవర్తనమున నడుచుట
                       కంటె ధర్మం బొండు గలదె నాకుఁ
బితృవాక్యపాలనస్థితిలేని యితరధ
                       ర్మమున నధోగతిప్రాప్తి గానఁ
గావింతు నీదు వాక్యక్రమంబున నన
                       రాజసన్నిభుఁడైన రాజమౌళి


తే. గీ.

వేఁట కుద్యుక్తుఁడయ్యె నావేళఁ బ్రజలఁ
బిల్చి ధర్మాంగదుండు గంభీరమధుర
భాషణంబుల లాలించి భక్తి వారి
యంతరంగంబు చిగురొత్త నప్పు డనియె.

124


మ.

నను బోధించె ధరాభరంబునకు భూనాథాగ్రగణ్యుండు మ
జ్జనకుం డావచనంబు సేయుట ప్రశస్తంబైన ధర్మంబు మ
ద్ఘనతేజంబున మిమ్ము దండధరుఁడున్ దండింపఁగాలేఁడు మీ
రనఘుల్ శ్రీహరిఁ గొల్వుఁడే సుకృతకర్మారంభులై నిత్యమున్.

125


వ.

ఏను బితృమార్గంబునకంటె నధికంబైనయది మీకు నెఱింగించెద.
జ్ఞాను లెల్లను సర్వంబు బ్రహ్మార్పణంబు సేయవలయు. మాతండ్రి
శాస్త్రక్రమంబున హరిదినోపవాసంబు సలువవలయునని యానతి యిచ్చె.
అదిగాక యాత్మకుం బునరావృత్తిరహితంబైన యది తద్బ్రహ్మార్పణ
సంజ్ఞికంబైన విశేషంబుగల దీరెండు నవశ్యంబుగా నాచరింపవలయు
నని ప్రజల మఱియు నూరడించి యహర్నిశంబును గంటికి నిద్రలేక