ధర్మప్రధానుండైన యారాజు మందరాచలంబునకుఁ దురంగంబు నెక్కి
రాఁగలండు. నీవు నచ్చట నుండి గీతంబున మోహంబు నొందించిన
హయంబు డిగ్గి గిరినితంబంబున నిన్నుం గవయునెడ నీదార నయ్యెద
నుదారా! నామాట యొక్కటి చేసెదనని శపథంబు సేయుమని భ్రమ
యించి దక్షిణకరంబుఁ గైకొని కొన్నిదినంబులకు సురతాంతతాంతా
త్ముండై చొక్కినయెడ నగి పూర్వశపథంబుఁ దలంచికొని తచ్ఛపథంబుఁ
బాలింపుమన నతం డంగీకరింపనని యే నిన్నుఁ బాసి నిముసంబు
నోర్వ; [1]దశమ్యేకాదశీద్వాదశీనిశాత్రయంబెల్ల నెడఁబాయుదు (ననుఁ
యౌవనోపేతయై సుముఖియైన స్వభార్యం గవయక సర్వాకాంక్షి)
యగు దురాచారుండు నరకంబు లొందు. శ్రాద్ధకాలంబులం దేనియు
నుపవిష్ణులై ద్విజులు భార్యాసంగమంబుఁ గోరిన ననుభవింపందగు
నండ్రని బోధించిన నీవ్రతంబు మానండేని నిజధృతకరవాలంబున
ధర్మాంగదశిరోనికర్తనంబు చేసి మదుత్సంగంబునఁ దచ్ఛిరంబు
నిలుపుమనినఁ బ్రాణసముండైన పుత్రుని హింసింపఁడు. బ్రాహ్మణ
వాక్యోపదేశంబున హరివాసరంబు విడుచునట్లైనఁ బూర్వమార్గంబునం
దిరుగుచు జనులు యమకింకరపాశబద్ధులై యమాంతికంబున కేఁగెదరు.
రాజును సత్యంబును నిలుపుకొనఁ దనయుని హింసించెనేనియు నశేష
కల్మషంబులం బాసి పరమధామంబుఁ జేరుననిన విని యాకమలలోచన
తండ్రివి, యాత్మజనైన నాకు నెయ్యది నామం బెట్లు మందరంబున
కేఁగుదు ననిన మోహినియను పేరు గావించి నిజశిష్యులు వెంట
నియోగించి పంచిన ధాతకుం బ్రణమిల్లి యమరులు వీక్షింపం దృతీయ
ముహూర్తంబున మందరగిరిశిఖాగ్రంబునకు డిగ్గె నప్పుడు.