పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అది కావున నేకార్యంబునకు నన్ను నియోగించితి వానతీవే యని విన్న
వించిన విరించి యిట్లనియె.

99


సీ.

సత్యమాడితి(వె) యసాధ్యమె నీకు నీ
                       భువనత్రయంబు, నీపూర్ణశక్తి
మచ్చిత్త మేని, నీమాయఁ జిక్కదె! ఘన
                       జ్ఞానాంకుశమున నిశ్చలత నిలిపి
నాఁడఁగాక, వయోధననిధానమైన నీ
                       రూపకళాలక్ష్మి చూపి యాడి
పాడి విలాససంపదల మించిన మనో
                       జాతుండు నీకు దాస్యంబు సేయు


తే. గీ.

మెఱయ స్త్రీవ్యక్తులెల్ల నిర్మించినాఁడఁ
గాని యిటువంటి రూపరేఖావిలాస
విక్రమస్ఫూర్తు లొకవింత వింతలయ్యె
నింతి! నాకైన శక్యమే యిఁక సృజింప.

100


వ.

అని బహూకరించి యిట్లనియె.

101

బ్రహ్మ మోహినికిం గర్తవ్యం బుపదేశించుట

తే. గీ.

అవని విదిశాపురం బేలు నతిబలోద్ధ
తాంగదుండైన యట్టి రుక్మాంగదుండు
వరలె సంధ్యావళి యనంగ వానిభార్య
సుదృఢసంధ్యావళీసదాస్తుతచరిత్ర.

102


సీ.

[1]ఆరాజసుతుఁడు ధర్మాంగదుం డనువాఁడు
                       తండ్రికంటెను మహౌదార్యగుణము
నం దధికుండు నాగాయుతబలశాలి
                       ధరణిఁ బ్రసిద్ధప్రతాపహేళి
క్షమ ధరాదేవత ఘనుఁ డాత్మజనకుఁ డా
                       ఢ్యుండు జంబూద్వీప మొకటి యేలె
నితఁడు సప్తద్వీపవితతధాత్రీమండ
                       లంబెల్ల నేలు శౌర్యంబు మెఱసి

  1. ఆరాజసుతుఁడు