పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నస్మద్విరోధి నత్యంతాంతరాయముల్
                       గల్పించి కలఁచి భగ్నముగఁ దద్వ్ర
తంబు దప్పించిన ధన్యుఁడనై గయా
                       పిండప్రదునియట్ల పెంపు గాంతు


తే. గీ.

నేతదాచారనిరతుల నింతనుండి
చూడవెఱతు హరిస్థితి చూడ్కు లొక్క
వ్యాజమున నుచ్చరించిన నణఁగు మాతృ
గర్భబాధలు మత్పురిఁ గానఁ డెపుడు.

79


తే. గీ.

నారదుండును గూడి విన్నపము సేయ
దండధరుఁ డంతకంతకు దైన్యమంద
నతని మన్నించుటకు నీరజాసనుండు
చింతతో నుండి నపు డొక్కకొంతతడవు.

80


సీ.

అలికాంతసంచలదలకాంతయలకాంత
                       యలకాంతకాంతలు నాత్మఁ గలఁగ
నవ్యభూషణభూషణంబైన రూపరే
                       ఖావిలాసంబులు గల్గి మెఱసి
నిజమనోజాతయై నిత్యవిభ్రాంతమ
                       నోజాతయై పూర్ణతేజ మంది
రుచిరవిద్రుమలతారుణ్యంబు తారుణ్య
                       మును బూని మోహంపుమొలక యనఁగ


తే. గీ.

నున్నఁ గమలాసనుఁడు చూచి యొఱపు నెఱప
మానసము కొంత గిలిగింత పూనఁ బ్రత్య
వాయభయమున నిజనేత్రవనరుహములు
భాసురజ్ఞానభరమున మూసికొనియె.

81

బ్రహ్మ మోహినీదేవతను బుట్టించుట

సీ.

[1]జననీతనూజాస్నుషా భ్రాతృజాయ గు
                       రుప్రియరాజభీరువులతో స
రాగమై తగు నంతరంగంబునఁ దలంప
                       రాదు; సరాగమై పాదుకొనిన

  1. జననీతరుణజా