పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

ధరణీనాథుఁ డతండు తన్మహిమచేతం దండనీయుండు గాఁ
డురుతేజంబున వేయువత్సరము లి ట్లుర్వీతలం బంతయున్
బరిపాలింప భుజాచతుష్టయముతో ధర్మాంశుకశ్రీలతో
గరుడారోహణలీలతోఁ గనిరి తత్కైవల్యధామోన్నతుల్.

62


తే. గీ.

అతఁడు ధర నుండెనే నితరాగ్రవృత్తి
ధారుణీలోక మాపరధామమునకుఁ
జేర్పఁగలఁ డీవు నాకు నిచ్చిన ప్రసిద్ధ
దండపట మణఁగించె నుద్దండమహిమ.

63


మ.

అరులం జ్యేష్ఠవిభావసుండువలె దీప్తాకారులం జేయఁడే!
నరుఁ డామూఢుఁడు పుట్ట నేమిటికి నన్యాయాత్ముఁడై మాతృదు
ర్భరగర్భాంతరదుర్గనిర్భరణనిర్భాగ్యుండు, శ్రీజన్మవి
స్ఫురణం బట్లనె కాదె కీర్తివిభవంబు ల్లేక వర్తించినన్.

64


క.

విద్యాబలసంపద నన
వద్యంబై పితృకులంబు వన్నెకు నెక్కుం
జోద్యముగాఁ జేయని సుతు
లార్యరజోరోగ మగుదు రాజననులకున్.

65


క.

ధర్మార్థకామములయెడఁ
గూర్మి మదిన్ విడిచి ప్రాతికూల్యస్థితిచే
దుర్మాదత నిలిపిన దు
ష్కర్ముని మఱి మాతృఘాతిగా నెంతు రిలన్.

66


ఆ. వె.

వీరసూసమాఖ్య విలసిల్లె రుక్మాంగ
దక్షితీశుఁ గన్నతల్లి యొకతె
మల్లిపి ప్రతాప మార్జనం బొనరించి
యాత్మజుండు జగము లాక్రమింప.

67


వ.

ఇ ట్లేరాజులు నడవ రితండు మత్పటహాని గావించి పటహానిశ
ఘోషంబునుం జాటించి యేకాదశీవ్రతంబు నడుపుచునున్నవాఁ డెట్ల
నోర్తునని విన్నవించిన విరించి యిట్లనియె.

68