పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మహోగ్రతరులు పాషండులు [1]ముగురు గలరు. తత్త్వపాషండులు,
వృత్తిపాషండులును, దత్త్వవృత్తిపాషండులు నన. తత్త్వపాషండులు
కర్మంబులు విడిచినవారు. వృత్తిపాషండులు బ్రహ్మంబు విడిచినవారు.
కర్మబ్రహ్మంబులు విడిచినవారు తత్త్వవృత్తిపాషండులు. వారికి కర్మ
బ్రహ్మంబులు లేవు. కాకున్న విపరీతం బగుంగాన వికల్పింపం బడుటం
జేసి యుపాత్తజ్ఞానమాత్రంబున వైదికులవలెం దోఁతురు గాని యవైదికులు
దారు కొందరు మధుసూదను నన్యదేవతాసమానునింగాఁ దలంచి
మీమాంసా కబంధపరులు చెప్పుచుంద్రు. రాహుకల్పులగువారు శిరో
భాగంబు సంగ్రహింపుదురు. కొందరు యజ్వాగ్రణులు యజ్ఞంబుల
నన్యదంభమూర్తులై దండకమండలంబులచేతనే తమయోగ్యత మెఱ
యింతురు. భగవంతుం డంతర్యామి వాసుదేవుం డారాధనీయపదాబ్జుండు
వైదికకర్మంబు లొనరింప ఫలంబు గలుగంజేయునని శ్రుతియునుం
బలుకు నిట్లగుటకు సకలధర్మంబులకుఁ జక్రధరుండు కర్తయై యుండుట
యెఱుంగక దుష్క్రియలు సేయు మదాంధులైన విమూఢులైన దుర్దేశికులు
సాధనాంతరములు గలుగ బోధించుకతనం బ్రతిభ విడిచి.

124


తే. గీ.

అహహ నగరాదులందు సర్వాన్నభోక్త
లగుచు సన్న్యాసులు చరింతు రందు నందు
మ్లేచ్ఛదుర్వృత్తి యాత్మలో మెఱసి బాహ్య
కృతదురాచారసంచారకీర్తిఁ గాంచు.

125


తే. గీ.

రాఘవునియాజ్ఞ సౌమిత్రి రణమునందు
నింద్రజిత్తునిఁ దునుమ నాయింద్రజిత్తుఁ
డతిసహాయంబు తానెయై యవనియందుఁ
గలిపురుషుఁ బాయక చరించుఁ గలుషవృత్తి.

126


క.

సమిదాధానవిసర్జిత
తమవృత్తిం బ్రహ్మచారితతి దిరుగుఁ దిగం
తములందుఁ గేవల తురం
గమనిత్యబ్రహ్మచర్యకలన చెలంగన్.

127


క.

ద్విజవరులందఱును మహీ
భుజుని నిజాజ్ఞం జరించి భూరిరణోర్విన్
భుజశక్తిం బాటింతురు
సుజనేతరు లగుచుఁ గర్మశూన్యత్వమునన్.

128
  1. మగురు