పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

పరిణయ మొల్లన్ బుత్రాం
తరవైభవ మొల్ల బంధుతతి యే నొల్లన్
హరిపాదాంబుజసేవా
పరతంత్రత యొకటి నాకుఁ బ్రాప్యం బరయన్.

70


వ.

అని విష్ణుచిత్తుండు వైరాగ్యంబు వహించి సకలమునిశరణ్యంబగు నైమి
శారణ్యంబున కేఁగి యోగాసనాసీనుండై ప్రాణాయామాదిసంయుతుండై
యున్న నొకనాఁడు వేఁట వచ్చి విక్రమాభరణుండను రాజు విష్ణుచిత్తునిం
జూచి సకలగుణాభిరామయగు కన్యక నర్పించెదనని తలంచి.

71


ఉ.

భూసురబాలుఁ డెవ్వఁడొ యపూర్వగుణోన్నతుఁ డిద్ధదివ్యమౌం
జీసకలాపధన్యుఁడు విశిష్టవరేణ్యుఁడు బ్రహ్మచారి యో
గాసనశాలి కృష్ణవిమలాజినధారి మదీయకన్య కీ
భాసురమూర్తి భర్తయగు భాగ్యము లెన్నటికిన్ లభించునో?

72


వ.

అని చేరవచ్చి యతనింజూచి యిట్లనియె.

73


సీ.

మందహాసాన్విత మధురభాషిణి విశా
                       లాక్షి పూర్ణేందునిభాస్య పక్వ
బింబాధర సుకేశిపేశలభ్రూనాస
                       కంబుకంఠి లతాంగి కంజహస్త
గుణవతి కించిదంకుఠితవయోధర్మ
                       నిమ్ననాభి సుమధ్యనిరతిశయని
తంబ రంభాస్తంభధన్యోరుయుగళ [1]సు
                       హల్లకపాద మోహనకపోల


తే. గీ.

మత్కుమారిక మనువంశమౌళినైన
రాజ నేనిత్తు నాయర్ధరాజ్య మిత్తు
నేలు మేలగు నీకు నూహింప సుతుఁడ
ననఘఁ శంకింపవలదు విఖ్యాతచరిత!

74


వ.

అని బోధించిన నగుమొగముతో బ్రహ్మచారి రాజున కిట్లనియె.

75
  1. లహల్లకపాద