పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ఘోరసంసారతాపనివారణంబు
చేసి పలికితి యో మునిసింహ! యట్టి
జనుఁడు [1]వైకుంఠగంగాంబుసక్తుఁ డగుచు
యదునగంబునఁ బరధామ మందె నెటుల?

64


వ.

అనిన నారదుం డిట్లనియె.

65

విష్ణుచిత్తుని కథ

సీ.

ఆచారపాలకుం డనుబ్రాహ్మణోత్తముఁ
                       డొకఁడు తద్భార్య లోకొత్తరైక
ధర్మచారిత్ర వర్ధని యనునది వారు
                       విష్ణుపూజాసక్తి విడువ కెపుడు
వర్ణాశ్రమోచితవరకర్మము లొనర్చి
                       శాస్త్రనిషిద్ధముల్ సంత్యజించి
యంభోజనేత్రనిజాజ్ఞావిలంఘన
                       భీతులై నిజధర్మరీతిఁ దిరిగి


తే. గీ.

రర్హతరసత్పదార్థంబు లర్పితములు
చేసి తచ్చేషమున నుల్లసిల్ల దేహ
ధారణ మొనర్చుకొని రమాధవచరిత్ర
సంతతాహ్లాదరసమున సంచరించి.

66


శా.

ఉన్నన్ వారికిఁ గల్గెఁ బుత్రుఁడు గుణాఢ్యుం డుత్తమాచారసం
పన్నుం డాఢ్యుఁడు సాధుసేవకుఁ డదంభస్వాంతుఁ డశ్రాంతుఁ డు
త్పన్నజ్ఞానవివేకశాలి హరిసద్భక్తిప్రవీణుండు వి
చ్ఛిన్నాహంకృతిదోషవర్జితుఁడు లక్ష్మీనాథసమ్యక్కృపన్.

67


ఆ. వె.

అతని విష్ణుచిత్తుఁ డనిరి సుధీవ్రత
నేతలంచితోపనీతుఁ డగుచు
వేదములును శ్రుతులు వేదాంగములు వేగ
నభ్యసించె జగము లౌననంగ.

68


వ.

అధ్యాత్మశాస్త్రంబు సర్వవేదియగు సన్మార్గదేశికుని వలన నెఱింగి
సర్వార్థసాధనంబయిన యష్టాక్షరమంత్రంబు గాంచి విద్య లెఱింగిన
తల్లిదండ్రులు వైవాహికవిధికి నుపక్రమింప విష్ణుచిత్తుం డిట్లనియె.

69
  1. వేకుంఠ