పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గని వీఁడె హింసించెఁగా యని వాని భం
                       జించిరి నాకంబు చేరె [1]రాజ
హంసంబు బ్రాహ్మణుం డరిగె హంసకుమార
                       మందిరంబునకు శ్రీమహిమ గలిగి


ఆ. వె.

యంత హంస మడిగె నయ్యమరవరుల
నన్ను నోర్చు బ్రాహ్మణవరుఁ డకట
యెందు నుండె నాకు నెఱుకసేయుం డన
ననిరి నరకవాసి యయ్యె ననుచు.

20


తే. గీ.

అమరులకు మ్రొక్కి యారాజహంస మాత్మ
సుకృతమున నేఁడు బ్రాహ్మణు సురపురమున
కధివసింపంగఁ గృపసేయుఁ డనుచు వారి
పాదనీరేరుహంబులఁ బవియె నంత.

21


క.

నిను హింసించిన పాతకి
ననఘా! నాకమున నునుపు మంటివి యేత
జ్జనులకు నిచటికి రావ
చ్చునె? యీ కార్యంబు వలదుసూ నీ కింకన్.

22


ఆ. వె.

అనిన మఱియు నతఁడు ప్రార్థింప నిర్బంధ
మున సుపర్వులెల్ల ననుమతింప
నాకమునకు వచ్చె నరకాంతరము మాని
భూసురుండు దుర్గుణాసురుండు.

23


క.

అనుకంపాశీలము గాం
చినవారికి శరణమన విశేషంబునఁ బ్రో
చిన యది సువ్రతమని స
జ్జను లాడుదు రఖిలధర్మసారజ్ఞులలోన్.

24


తే. గీ.

ఒనరఁ బ్రత్యక్షనారాయణోక్తపాంచ
రాత్రసారాంశ మఖిలైకపాత్ర మతివి
చిత్ర మమలపవిత్రచరిత్ర మిందు
నెంచ శరణాగతత్రాణ మింత మించు.

25
  1. రాజు హంసంబు-