పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గలిగి సన్యాసియై కమలాక్షుఁ డట్లుండ
                       నుచితవేదములు బహ్వృచుఁ డనంగ
నాధర్వణికుఁ డన నధ్వర్యుఁ డన సామ
                       గుం డన సాంఖ్యలు దండిమెఱసి


తే. గీ.

యమ్మహాత్మునిశిష్యత్వ మాచరించి
యంగషట్కంబు నిజశిష్యులై చెలంగఁ
గలిగె నిజభక్తిపేరఁ బుష్కరిణి యనఁగ
నొక్కతీర్థంబు సకలలోకోత్తమంబు.

7


తే. గీ.

మానవాకారములను మీమాంసధర్మ
శాస్త్రగణమును న్యాయవిస్తరము దత్పు
రాణములుమించె నారమారమణుఁ డిట్లు
ఘనత వర్తించె [1]బహుశిష్యగణము లమర.

8


తే. గీ.

జగతిఁ బాషండశింశుపాషండదావ
వహ్నియై ప్రాంతదేశనివాసులైన
వారి శిక్షించె ధారుణీవలయమునను
జ్ఞానసంపత్తి వర్ధిల్ల సంఘటించె.

9


తే. గీ.

రూఢి శాండిల్యుఁడను మునీంద్రుండు మున్ను
బాంచరాత్రప్రమాణప్రభావశక్తి
నాగమార్థంబు వ్యర్థమౌ న ట్లొనర్చు
శఠులఁ బాషండ జినులను సంహరించె.

10


తే. గీ.

రాహుదంశనమునఁ బాసి యాహిమాంశుఁ
డలరుగతి మంచుతెరఁ బాసి యర్కబింబ
మంబరమునఁ బ్రకాశించునట్లు జ్ఞాన
మతిశయం బందెఁ బాషండు లణఁగినపుడు.

11

వ్యాఘ్రవానరకిరాతసంవాదము

వ.

ఇట్లు పాషండఖండనంబు గావింప నన్నిదిక్కులం దిరిగి వేదంబులు
కల్యాణతీర్థతీరంబున శాండిల్యసమేతుండైన దత్తాత్రేయుని గాంచి
స్వామీ! యొకయాశ్చర్యంబు చూచితి మనిన నది యేమి యని యడి
గిన నొకవానరుం డరణ్యంబున నొక్కనగాగ్రంబున నుండి వ్యాఘ్ర

  1. బహుశిష్యగణము లగుచు