ఆబ్రహ్మరాక్షసుం డచ్చటఁ దిరుగుచున్నవాఁ డగుట సకలమహా
పాపంబులకు హరికీర్తనంబు సేయుటయే ప్రాయశ్చిత్తం బని శ్రుతి
స్మృతిపురాణేతిహాసంబులు ప్రమాణంబులుగా ఆభాగవతులు ప్రసంగ
వశమున చెప్పికొనుమాటలు దూరంబుననుండి విని గృధ్రరూపులై
యున్న భార్యాపుత్రులును దానును హరిభక్తిదర్శనకీర్తనంబుల
హృదయంబు ప్రసన్నంబైన ఆవిష్ణుభక్తపదాంభోజసంగపూతజలంబు
దృష్టిపథంబున నున్నఁ బానంబు చేసి యా రాక్షసుండ వైకుంఠ
తద్భక్తభుక్తశిష్టపాత్రక్షాళనతోయపరికీర్ణాన్నకబళంబులు భుజించి
గృధ్రంబులు దాను జాతిస్మరత్వంబు నొంది వైవస్వతుఁ డానతి
యిచ్చినక్రమంబుఁ దలంచుకొని విష్ణుభక్తాంఘ్రితీర్థంబున ముక్తియె
ఫలియించె; ఫలాంతరము లనిన నెంత? యని భావించుచు.