పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బాండవస్యందనంబునఁ జూపట్టుటయు, ననిరుద్ధకిరీటధారణంబును,
బింఛావతంసధరణంబును, [1]ధర్మప్రతిష్ఠాపనస్వీకృతమానవ
రూపంబును, నవనీతచౌర్యంబును, నిత్యావ్యాహలైశ్వర్యంబును, ఉగ్ర
సేననియామ్యత్వంబును, బ్రహ్మరుద్రాధిపత్యంబును, గుర్వాదినమ
స్క్రియయు మొదలైన చిత్రవిచిత్రంబులు మెఱయించుచు వర్తించె
ననిన మునులు సర్వంబును నెఱుంగుదుము. కాని యా కృష్ణునకు నని
రుద్ధకిరీటధారణం బెట్లు సంభవించెనది యెఱుంగము. దానిం దెలియఁ
జెప్పవే యని మును లడిగిన వారికి నారదుం డిట్లనియె.

149

శ్రీకృష్ణుని మణికిరీటధారణగాథ

సీ.

అసురేశ్వరుండు ప్రహ్లాదపుత్రుండు వి
                       రోచనుండను వాఁడు రూఢయశుఁడు
కలశాబ్ధిమధ్యభాగమునందు ననిరుద్ధ
                       సేవ సేయుచు నతిస్థిరత నిలిచి
యొకరుండు నాహరియోగనిద్రాసక్తి
                       నుండఁ దక్కినమును లొయ్య నొయ్యఁ
జనఁగఁ బ్రహ్లాదాత్మజాతత్త్వమహిమ ప్ర
                       భూతశక్తి వహించి స్ఫుటత రాగ


తే. గీ.

రంగభావంబు నొంది నిరంతరంబు
చేరి కొలుచుచుఁ దద్విష్ణుశీర్షదివ్య
మణికిరీటంబు గొని నాగమందిరాంత
రాళ మొగిఁ జొచ్చె వాఁడు దుశ్శీలుఁ డగుచు.

150


వ.

అంత భగవంతుఁడు రమతో మేల్కొనిన సేవకజనంబులు చేరి హరి
కిరీటంబుఁ గానక యాహరి నడిగిన నే నిద్రింప నెవ్వఁడు హరించెనో
యేమియు నెఱుంగననినఁ దద్వాక్యంబులు విని వారలు విరోచనుండే
హరించి చనియె. ఏమందఱము నిచ్చటనే యున్నవారము, అతఁ డసుర
వంశోద్భవుండు, ఎల్లప్పుడు పాపంబే తలంచు, ఇప్పుడు మృచ్చిలిన
వాఁడై యుండియే పలాయనంబు నొందెనని నిశ్చయించి వైనతేయునిఁ
బిలిచి మాలో బలవేగసంపన్నుండవు నీవే విరోచనుని సాధింపుమని
ప్రార్థించిన.

151
  1. స్పతిష్టారూపత్వంబును