పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

నూఱు రథములు మున్నూఱు దాసులు భద్ర
                       గజసహస్రము తురంగ మవరాయు
తము నవమణినియుతంబు జాంబూనద
                       నిష్కకోటి సస్యనిచయశాలి
శాలి సుక్షేత్రయోజనశతంబును ధేను
                       గణములు దివ్యాంశుకము లసంఖ్య
ములు భూషణస్తోమములు పల్లకులమేయ
                       ము లపుడు యౌతకముగ నొసంగి


తే. గీ.

కనకమాలినిఁ జూచి యోకన్య నీమ
నంబులో నున్నయది సమ్మదంబుతోడ
వేఁడు మిచ్చెద ననిన నవ్విమలగాత్రి
యతని సత్యంబుఁ బలికించి యప్పు డనియె.

142

పుత్రికయైన హేమమాలినికి కుశుఁడు శ్రీరాముఁడు నారాధించిన శ్రీహరి అర్చామూర్తి నొసఁగుట

తే. గీ.

వెలయు హరిదివ్యమంగళవిగ్రహంబు
రామచంద్రార్పితంబు తద్ద్రవ్య మొకటి
యది సమర్పించితేని నాయాత్మఁ గల్గు
కామితములు ఫలించు నిక్కముగఁ దండ్రి.

143


క.

అన జనకతనయవాక్యము
మనమునఁ జింతించి కుశుఁడు మధుసూదనమూ
ర్తినిఁ దతకీర్తి నతులశో
భనవిస్ఫూర్తిని నిజాత్మభవ కర్పించెన్.

144


వ.

ఇట్లు కుశుం డియ్యవలసినవి యెల్ల నిచ్చినం బుచ్చుకొని యదుభూష
ణుండు యదుశేఖరకనకమాలినీకన్యాసమేతుండై పురంబు వెడలి
చనునెడ వెదకి వెదకి మున్ను రాజు లడుగ వచ్చిన కుశుం డంగీక
రింపక పితృవచనప్రామాణ్యంబునఁ దద్యదుభూషణపుత్రుండగు
యదుశేఖరున కర్పించినఁ దద్రాజులు రోషంబునఁ దత్కన్యాపహర
ణంబు గావింపఁ దలంచి మార్గంబున.

145