పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

కుశుండు సంతసిల్ల నక్కన్య ధన్యయై నారాయణసేవఁ గావించె.
కుశలవు రిరువురును కుశీలవులతోఁ గూడి తత్స్వామిసన్నిధిని రామా
యణగానం బొనర్చుచుండిరి. అంత.

136

సీతారాములు కుశునకు స్వప్నంబున దర్శన మిచ్చుట

మ.

అలసాపాంగవిలోచనంబులు సముద్యన్నవ్యవక్షోజకు
ట్మలముల్ పూర్ణనవీనసత్కళలు సమ్యఙ్మంజుశోణాధరాం
చలమున్ సాలవిలాససంపదయు మించం గంతుసమ్మోహనా
స్త్రలసద్దేవతవోలె నత్తరుణి సౌందర్యంబుతో మీఱఁగన్.

137


వ.

ఆయింతికిం దగినభర్తను విమర్శించి కానక, కుశుండు నిద్రించునంత
భరతలక్ష్మణశత్రుఘ్నసమేతుండై రామభద్రుండును, జననియైన
జానకియుం గాన్పించిరి. కుశుండు కౌతూహలంబున బ్రణామంబు
లాచరించిన యంతఁ దారాధిపవరాననుండై రామభద్రుండు తమోప
హారులైన వచనంబులచే నాదరింపుచు యదుశేఖరుం డనువానికి నీకన్య
నొసంగుమనియె. జనకసుతయుఁ దండ్రి యొసంగిన ద్రవ్యం బక్క
న్యకకుఁ బరమప్రీతి కారణంబుగా సకలవస్తువులు నక్కన్యకకు
యౌతకంబుగా నిచ్చి యవ్వరున కర్పింపుమని యానతి యిచ్చె. ఇట్లాజ్ఞా
పించి వా రదృశ్యులై చనిరి. కుశుండు మేల్కాంచి నిజకాంతతో నీ
స్వప్నంబు [1]వివరించి హర్షంబు నొందె నంత.

138


క.

అరిగితి నే నాయదుశే
ఖరపాలితపురమునకు నఖండితతేజ
స్ఫురణంబున నారాయణ
గిరివరవరలబ్ధి నతఁడు క్షితి పాలించున్.

139


తే. గీ.

పూర్ణశీలుండు యాదవభూషణుండు
నాఁగ నాతనితండ్రి భూనాథమౌళి
తద్గుణానుగుణవిలాస ధన్యఁ గన్య
నోర్తు వెదకుచునుండె నత్యుత్సవమున.

140


తే. గీ.

సర్వసౌభాగ్యభాగ్యలక్షణములందుఁ
గుశతనూజాత మెఱయుట కుశలబుద్ధి
నే నెఱింగింపఁ దద్రాజధాని కేఁగి
పరిణయముఁ జేసికొని యదుప్రవరుఁ డేఁగ.

141
  1. విన్నవించి