అనిన విని విస్మయం బంది నిజరూపంబుఁ జూపుమని విన్నవించిన
దూరదేశంబు తిరిగి యలసినవాఁడ నడువ శక్తుండఁ గాను పుత్రులు
శిశువులు. నీవే కల్యాణతీర్థంబవై ప్రవహింపుమని బ్రాహ్మణుండు
మ్రొక్కిన యమునం జూచి నగి యాదరంబున నిలిచి యుత్తుంగ
తరంగయై యున్న యాతరంగిణిం బ్రార్థించిన నన్నుఁ గల్యాణతీర్థంబుగాఁ
ద్రిరావృతంబుగా నుచ్చరించి మత్ప్రవాహంబున నవగాహనంబు
గావించిన నభీష్టంబు లభించునని యానతి యిచ్చిన నట్లనే బ్రాహ్మణుం
డొనర్చి మునింగిన యదుశైలంబును, గల్యాణతీర్థంబును, దత్రత్యులగు
మునులును గానుపించిన విస్మయము నొందె. అంత నీ వెవ్వరు? నీ విచ్చటి
కెట్లు వచ్చితి వని యడుగు మునులకు నిజవృత్తాంతంబుఁ దెలిపి యీ
స్థానం బెయ్యది యని యడిగిన వారలు యదుశైలం బని యానతి యిచ్చిన
నానందంబు నొంది శ్రీమన్నారాయణుని సేవించి తన్మహానగంబు నిజ
నివాసంబుఁ జేసికొని, నివేదితాన్నంబును భుజించుచు నచ్చట నారాయ
ణుం డను నొకపుత్రునిం గని యపరిగ్రహయావల్లబ్ధోవజీవనుండై
యాబ్రాహ్మణుండు.