ఈకల్యాణతీర్థంబున మునింగి యధికారానురూపంబుగా నను భజించిన
వారు మత్ప్రసాదంబున నిఖిలమనోరథంబులు నొందఁగలరు. ఈ
కల్యాణతీర్థతీరంబునఁ బైతృకక్రియలు గావించినఁ బితృగణంబులు
[2]హర్షించు పుణ్యపరవృత్తి నధ్యాత్మగుణసంపత్తి నపవర్గపరాయ
ణులై పెక్కండ్రుపుత్రులం బడయఁగలరు. ఈకల్యాణతీర్థతీరం
బున యజ్ఞంబుఁ జేసిన సహస్రగుణంబగు పుణ్యంబు సంభవించి యప
వర్గంబు గాంతురు. ఈకల్యాణతీర్థంబున నిష్కాములై నన్ను సేవిం
చినయేని యభీష్టంబు లొసంగుదు. ఈకల్యాణతీర్థతీరంబున
దానంబుఁ జేసినఁ జతురార్ణవీపరిమితమహీతలం బేలుచుఁ జక్రవర్తియై
పుత్రపౌత్రాభివృద్ధిగా వర్ధిల్లు. ఈకల్యాణతీర్థగర్భంబున వ్రతంబు
లాచరించిన బ్రహ్మలోకంబున బ్రహ్మతో ననుమోదించుచు నుంద్రు.
ఈకల్యాణతీర్థంబునఁ గోరిన కోరికలన్నియు మత్ప్రసాదంబున ఫలి
యించు. ఫాల్గుని ప్రశస్తంబు గాన నాఫాల్గునియందు సర్వధర్మంబులు
గావించి మీ రచ్చటికిం జనుదెం డనిన రుద్రముఖ్యత్రిదశాధిపులు భగవ
ద్వాక్యంబులు విని నిజస్థానంబులకుం జనిరి. అంత.