అంత నప్పద్మజుని విష్వక్సేనుండు విమానంబుముందఱ నిడుకొని
మన్నించి కమలారమణుండు తులసీమాలికామోదవాసనావాసితో
రస్స్థలుండు జగన్నాథుం డానందైకార్ణవంబు నిన్నుఁ [1]గటాక్షింప నరు
దెంచె భజింపు, మితండె నీకు సర్వస్వంబు, భవవార్ధితారకుండు. నీవు
చేసిన తపంబు ఫలించె నన, నగ్రంబున సేనాధిపతి నారాధించి కన్ను
లకు ఫలంబై యన్యోన్యసల్లాపంబు లాడుచు నిందిర కరసరోజంబు
లచేఁ బదంబు లొత్త స్ఫురత్కిరీటహారకేయూరమంజీరవిరాజ
మానంబై తదన్యమణిభూషణంబులచేత శోభిల్లి, చక్రాద్యాయుధంబుల
చేత విజృంభించి, వైజయంతీ[2]మాలికాభిరామణీయకంబునం గనుపట్టి
పద్మామణిపీఠంబైన శ్రీవత్సంబున రాణించి, పుండరీకధవళామ్నాయ
పుష్కరేక్షణపద్దతియై, రాకాశశాంకసౌభాగ్యపరిభావిముఖాంబు
జంబై, కంబుగ్రీవంబై, సువిస్తీర్ణకవాట[3]ఘటితోరస్కంబై, చతుర్భు
జంబై, యుదారాంగంబై, పీతకౌశేయవస్త్రంబై, సమస్తజగచ్ఛరణ్య
పదాంబుజంబైన యొకదివ్యతేజంబు వీక్షించి, తదాపాదమస్తకాంతర
సౌందర్యం బనుభవించి యాపంకేరుహోద్భవుం డిట్లని వినుతించె
నంత.