క. |
అక్షీణశక్తిని విరూ
పాక్షుండన నొక్కపుత్రుఁ డతనికిఁ గల్గెన్
దక్షుఁడు హరిభక్తిరతుం
డక్షయవిజ్ఞానవైభవాధిక్యుండై.
| 25
|
వ. |
అంత విధాత పురందరాదిదివిజస్తుతుండై దేవదేవుండన వెలసిన
తనయునకు భవోత్తారకం బుపదేశించి వేదవేదాంతంబులు చదివించిన
నతం డైశ్వర్యంబు వహించి సర్వభూతంబులకు నైహికంబులు కృప
సేయుచునుండ సర్వదేవతలను సర్వఋషులను జతుర్ముఖుండు
సృజించె. బ్రహ్మ సృజించుటకు, విష్ణుండు నిల్పుటకు, రుద్రుండు
హరించుటకుఁ బాల్పడిరి. మఱియును.
| 26
|
క. |
వెలయఁగ దక్షాదులు పు
త్రులు గొల్వ సరోజభవుఁడు తోడ్తో లక్ష్మీ
లలనాధవపదసేవా
కలనాస్థితి నాచరింపఁగాఁ జర్చించెన్.
| 27
|
బ్రహ్మ శ్రీమన్నారాయణుని అర్చారూపమును సేవింపఁగోరుట
క. |
అంతం బద్మజుఁడు రమా
కాంతార్చారూపమహిమ గనుఁగొని సకలై
కాంతికధృతిఁ జెందెదనని
చింతించె నశేషతీర్థసీమలయందున్.
| 28
|
క. |
పులకించి మున్ను చూచిన
బలవన్ముని[1]మానధనముఁ బరమాత్మమదిన్
దలఁపుచు సారోపనిష
త్కులతిలకము మంత్ర మునిచి గురుమతి వెలయన్.
| 29
|
తే. గీ. |
శమితపాపౌఘమై శంఖచక్రముఖ్య
చిహ్నములు చేత వెలయు నాశ్రితశరణ్య
భాగధేయంబనాఁదగు పరమపురుషు
[2]హసితవేశాశరాప్తిఁ బద్మాక్షుఁ గాంచి.
| 30
|
- ↑ మానధనము పరమాత్మమదిన్
- ↑ హసితలేశోదరోప్తిమ