పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

జలనిధిశాయియైన మధుశాసనునాభిని దివ్యమై మహో
త్పల ముదయించె నందు వితతస్ఫురితాంజలియై వినమ్రుఁడై
కలిత శుచిస్మితుండయి యొకానొకబాలుఁడు పుట్టె నాల్గుమో
ములను జతుర్భుజప్రథితమూర్తికి నిట్లు తగున్ [1]జనింపఁగన్.

16


మ.

అని యీరీతి దిశాంతరంబుల సమస్తామ్నాయముల్ చాట న
బ్జనివాసాంగన సత్కృపామృతరసస్తన్యంబుచే వృద్ధిఁ బొం
ద నిజప్రేమ నొనర్చె శౌరిదయయే తా నిట్లనైయుండెనో
యన నాబిడ్డని కిచ్చె నైహికసుఖం బాముష్మికశ్రేయమున్.

17

శ్రీహరి నాభికమలమునఁ జతుర్ముఖబ్రహ్మ ముదయించుట

వ.

అనపాయినియగు నిందిరాదేవి ప్రార్థించిన నప్పరమాత్మ వొమ్మనిన
నతండును బాల్యంబున 'నో౽మో'మ్మని పలుక నయ్యాదిదంపతులు
నగిరి. అంత హరి నగుచు హరి యన్నవెనుక హరి యని పలికె.
అదియ యావర్తింపుచుండె. ప్రణవంబును, బ్రణవాద్యక్షరద్వయమును
“హరిః ఓమ్” అని యుచ్చరింప వేదంబున కాదిప్రణవం బయ్యె. ప్రణ
వంబునకుఁ గారణం బకారం, బకారంబున కర్థంబు పరబ్రహ్మంబగు
నారాయణపదంబు. ఇట్లు ప్రణవంబు పలుకు నాత్మజుం గృపాదృష్టిం
జూచి భగవంతుండు హర్షించి నాల్గువేదంబులు నర్థంబుతో నభ్యసింపఁ
జేసె. రహస్యం బెద్దియుఁ బ్రథమపుత్రునకుఁ బ్రియశిష్యునకు నెఱిఁగింప
రానియది లేదు గావున సర్వంబును బోధింపవలయునని యాశౌరి
శరీరంబు రథంబుగా నెఱుంగుము. జీవు లయ్యుగ్యంబులుగా నెఱుంగుము.
షడ్గుణంబులు గుణంబులుగా నెఱుంగుము. సర్వధర్మంబులయందు
స్వతంత్రుండగా నని తలంచి నన్ను నేసాధనంబును తద్బలంబునుంగా
నెఱుంగుమని బోధింప బ్రహ్మ సర్వజ్ఞుండై యష్టాక్షరప్రభావం బడిగిన
నష్టాక్షరమంత్రంబు శ్రుతిదృష్టిఁ జతుర్వర్గసాధనము.

ఓం నమో౽నారాయణాయ అను అష్టాక్షరమంత్రపుఁబ్రభావమును శౌరి బ్రహ్మ కుపదేశించుట

బహుమంత్రంబు లేల? బహుకర్మంబు లేల? ఈయష్టాక్షర
మంత్రం బసాధారణం బయ్యు సర్వమూర్తులయందును సాధారణంబై
సహస్రపర్యంతంబులైన మంత్రంబులలో నిదియ యుత్కృష్టంబు.

  1. తలంచఁగన్