పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వినిన యది మీకు నెఱింగించెద వినుఁడు — ఆత్మగుణపన్నగ
పరిదష్టులైనవారికి నజ్ఞానవారణంబైన గురూపదేశమే పరమౌషధము.
పరమధర్మము. పురుషోత్తములీలచే మున్ను చరాచరవిశ్వము
తమోమాత్రరూపవిశిష్టమై పరబ్రహ్మంబుఁ బొందియుండు. ప్రధాన
పురుషు లనంగా నీశ్వరునికి శరీరద్వయ మాధేయత్వ విధేయత్వ
శేషత్వములచే నఖిలజగంబులకుఁ దారకుండై నియంతయై శేషియైన
హరికిఁ దనువు గావునఁ దదాత్మకత్వముచేతఁ బ్రధానపురుషులు
విశ్వంబునకుం గారణంబని నిగమంబులయందుఁ బలుకంబడియె.
ప్రధానపురుషులు స్వతంత్రకారణంబులు గారు. తత్ప్రళయకాలము
నందును బురుషులు పురుషార్థరహితులై యుచిత్సదృశులై జడు
లగుదురు. అంత భోగనిర్ముక్తులై ప్రకృతిసంశ్రయులైన పురుషులం
జూచిన పుండరీకాక్షునకు నొకానొకయనిర్వాచ్యమైన కరుణ వొడము.
వారి రక్షింప సృజియింప నిచ్ఛ యుదయించు. ఈపురాణపురుషుని
సంకల్పంబునం బ్రకృతి మఱియు గుణంబులచే మహదాదిప్రభేదం
బైన వికారంబు నొందు. మహ త్తహంకృతిం గల్పించు. అయ్యహం
కృతి సాత్వికాదివిభాగంబు దగుగుణభేదంబులచేఁ ద్రివిధంబై యుండు.
సాత్వికాహంకారంబువలన నింద్రియసముత్పత్తియుఁ, దామసాహం
కారంబువలన భూతసంభవంబు నగు. ఆరెంటికి రాజసాహంకారంబు
ప్రకృతిఁ గావించు. పంచభూతంబులకు శబ్దాదు లుత్తరోత్తరాధికంబు లై
జనియించుం గాన మహి పంచగుణ యగు. తన్మాత్రానుభూతభేదంబు
సూక్ష్మస్థూలవిభాగంబున నగు కలకలంబై దేహరూపంబునఁ బొడమి
నట్లు తన్మాత్రారూపమే భూతత్వము నధిగమించుఁ, గార్యపరంపర
సేయు. నానావిద్యాన్వితంబై కూడక వేఱెవేఱెయై యున్న యీ
భూతంబు లండసృష్ఠియందు నశక్తంబులై యుండం, గార్యపరం
పర సేయ సత్యసంకల్పుండైన భగవంతుండు పంచభూతంబుల
యందుఁ బంచీకరణ మొనర్చి పంచభూతము లర్ధమర్ధములు తమభాగ
ములు గైకొని కడమ యర్ధమర్ధమును నాలుగుభాగములు చేసి తన
పేరైన నాల్గింటనుఁ గూర్చుట యది పంచీకరణము. ఆకాశాదులయందు
నాకాశాదివ్యవహారము స్వభావాధిక్యముచే నిష్టం బగు. దశోత్తరావరణ
పరీతంబైన యండంబు పరమపురుషుండు కనకఖండంబుఁబలె నుత్పా
దించి భూతంబులచే భూతాధిచే మహత్తుచే నీయండం బావరింపఁజేసి
సమష్టిసృష్టియు, సృష్టి మొదలగు వ్యష్టసృష్టి పిదపంగాఁ గలదు. అండ
మధ్యంబునం గార్యపురుషుండు త్రయీభాగస్తూయమానుండై జలా
శయంబున నధిశయించె మఱియును.

12