పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

యాదవాద్రికిం గాపుగా సుదర్శనపురుషుండు తిరుగు. యాదవశైలా
సక్తులగు మద్భక్తులం బీడించువారి దత్సుదర్శనజ్వాలామాలిక శల
భంబులంగాఁ జేయు ద్వాపరాంతంబునం గలిపురుషం డచ్చటికి రా నుపక్ర
మింప వేత్రదండధరులైన యమకింకరులు వారింపుదురు. వత్సరంబేని
పక్షంలేని పక్షార్ధంబేని త్రిరాత్రంబేని యేకరాత్రంబేని యదుగిరి నున్న
యతండే మద్భక్తుం డన్యుండు గాఁడు. ఫాల్గునియందు యామంబేని,
తదర్థంబేని నన్ను నాయాదవాద్రిని సేవించినవాని జననిస్తనంధయు
నింబోలె నను వర్తింపుదురు గాన మీ రచటికి నేఁగి నన్నుఁ బూజించి
పరమభక్తులై సంస్కృతి తరింపఁగలరని ధర్మపరాయణులు ధర్మంబు
లార్జించి పునర్జన్మంబు లొందుదురు గాని యాదవాద్రినివాసులైన
వారికిఁ బునర్జన్మంబులు లేవని భగవంతుఁ డానతిచ్చిన మునులు దండ
ప్రణామంబులు చేసి మాకుఁ బరమబంధుండవును పరమగతియు నీవే
యని విన్నవించినప్పుడు.

509


క.

సంక్షేపంబున నస్మ
త్కాంక్ష నివర్తింప దఖిలకలికర్దమని
స్సంక్షాళనంబు సేయు ని
దం క్షేత్రము మహిమ మాకుఁ దగఁ దెలుపు దయన్.

510


వ.

అనిన.

511


క.

మును పద్మభవునివలనన్
సనత్కుమారుండు దెలిసి సమ్మతిఁ దచ్ఛై
లనమహిమ నారదునకున్
ననుపమసద్భక్తి దెలిపె నతిహర్షమునన్.

512


వ.

ఆనారదుండు నీకు సవిస్తరంబున బోధించునని భగవంతుం డానతి
యిచ్చి యంతర్ధానంబు నొందె నంత.

513


ఉ.

మాలిక మాలికాభరణమన్మథ మన్మథయోగిహృన్మణీ
శాలిక శాలికామదవిశాలదృగంచలనూత్నచంద్రశా
బాలిక బాలికాజనరతాయనవచ్యుతమాలికాగ్రకం
కేలిక కేళికావనరగీత వినీతసుధాము ధాము దా.

514