పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

దూషక పరాంగనాసక్త ధూర్త పరధ
నాపహారక పాపభేదానురక్త
పరవినిందానిజస్తుతిప్రవణులేని
ముక్తు లగుదురు దోషనిర్ముక్తు లగుచు.

481


సీ.

పాషండశాస్త్రతత్పరులు శూద్రాన్నభ
                       క్షకులు శునకవరాహకృకవాకు
రక్షకుల్ కర్మవిక్రయపరుల్ శ్రాద్ధభో
                       క్తలు గ్రామయాచకుల్ దైవతస్వ
హరులు దుర్గర్వదంభాదిసంయుతులు ని
                       రంతరకనకవాసాభిరతులు
రాజసేవైకకర్మఠు లాత్మకన్యకా
                       విక్రయపరులు దుర్వర్తచరులు


తే. గీ.

కాకవృత్తులు గోక్లేశకరణపరులు
విప్రనిందక హరిభక్తి వరహిత శర
ణాగతద్రోహ వృషవిధవాసుచిత్ర
ముఖులు దద్గిరి సేవించి ముక్తిఁ గండ్రు.

482


తే. గీ.

ప్రబలతరమైన తద్గిరీంద్రమున కనతి
దూరమునఁ బుణ్యసంపదపారమహిమఁ
బరఁగు నరసింహభూధరప్రవర మతిప
విత్రుఁగాఁ జేయుఁ జూడ నపాత్రునైన.

483


క.

ఆయెడ నతిభక్తిపరుం
డై యాప్రహ్లాదుఁ డతిగుణాఢ్యుఁడు సులభో
పాయకృతనిఖిలలోక
శ్రేయంబుగ నన్ను శ్రీనృసింహుని నిలిపెన్.

484


తే. గీ.

అఖిలలోకోన్నతంబైన యన్నగంబు
మీఁదికెక్కిన మనుజుఁ డమేయదుర్ని
వారసంసారసాగరావర్తములను
మునుఁగఁ డెన్నఁడుఁ దన్మహాఘనత దెలిసి.

485


క.

కల దొకయశ్వత్థ మమృత
ఫలమై కల్యాణతీర్థపశ్చిమసీమ
స్థలినిఁ జతుర్వర్గదమై
యలఘుతరజ్ఞానదారకాహ్వయ మగుచున్.

486