పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

ఆదిమై ననంతుఁ డయ్యె లక్ష్మణుఁ డయ్యె
నంతట బలభద్రుఁ డయ్యె నింకఁ
గలియుగమున నొక్కఘనయోగివర్యుండు
గాఁగలండు దేవగణము లెంచ.

475


తే. గీ.

రామకృష్ణులు నన్ను నిరంతరంబు
నచటఁ బూజించి కొలువ విఖ్యాతమయ్యె
జగతి నగ్గిరి యాదవశైల మనఁగ
శేషశుభమూర్తిని సహస్రశిఖరములను.

476


వ.

వైకుంఠాద్యచ్యుతస్థానలోకసారంబైన యాయదుశైలంబు సేవించిన
సమస్తమదీయస్థానంబులు సేవించినయట్లగు.

477


తే. గీ.

ఆద్యులగు శేషశేషాశనాదులైన
పరమవైకుంఠవాసు లాపర్వతమునఁ
దిర్యగచరస్వరూపముల్ తెలివి దాల్చి
సంతసంబునఁ బ్రేమ వర్తింతు రెలమి.

478


తే. గీ.

అందుఁ బ్రాకృతమనుజమృగాండజాది
సముదయంబులఁ గొంతదూరమునఁ గాంచి
ఘోరదుర్వారయమభటకోటులెల్లఁ
దొలఁగి మ్రొక్కుచు నపుఁ డేగుదురు భయమున.

479


తే. గీ.

యాదవాద్రికి నేఁగెద ననుచు నాత్మ
యందు నూహించు నరుఁడు నిత్యము వసించు
నట్టిదేశంబు చొరఁగ భయంబు నొంది
దూరమున కేఁగుదురు యమదూతవరులు.

480


సీ.

అటుగాన మీర లయ్యద్రిపైఁ గల్యాణ
                       తీర్థంబ గలదు నాతీర్థమునను
బుద్ధిమై మునిఁగి నమిద్దభవాంభోధి
                       దాఁటెద రదియె పుణ్యతరధామ
మాపుష్కరంబు సురాపగాయమునలు
                       వ్యాపించు నయ్యద్రి నణఁగు బ్రహ్మ
హత్యాదిపాపంబు లధికనాస్తికకృత
                       ఘ్నమఘవిఘ్నప్రదామ్నాయ పాశ(ద)