పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

నలువం జేరి భృగుండు మత్తునిగతిన్ వర్తించ రోషించి యా
కులుఁడౌ తద్దుహిణుం ద్యజించి వడి భర్గుం డాసి యామేటి ని
శ్చలతం గౌఁగిటిఁ జేర్ప వచ్చిన నుపేక్షాదృష్టి దా నుండ ను
జ్జ్వలశూలంబున గ్రువ్వఁబూనునతనిన్ వర్జించి వేగంబునన్.

430


క.

వైకుంఠమునకుఁ జని ముని
వైకుంఠునిఁ జూచి కనలి వక్షముఁ దన్నన్
లోకోత్తరచరితుఁడు హరి
యాకర్మందినతిపాద మల్లన యొత్తెన్.

431


వ.

ఒత్తిన నీవే శుద్ధసత్త్వమూర్తివని జనార్దనుం బ్రశంసించి మగుడి చను
దెంచి భృగుం డామునీశ్వరులకుఁ దద్వృత్తాంతంబంతయు నెఱింగించె.

432


క.

పరమశుభాకారుఁడు శ్రీ
వరుఁడే సత్త్వనిధి బ్రహ్మవాసవముఖ్యా
మరవిభుఁడు కృపాంభోనిధి -
యరయఁగ నొసఁగున్ ధనాయురారోగ్యంబుల్.

433


వ.

అని తలఁచి ప్రమోదం బంది రంత.

434

ద్వారకలో శ్రీకృష్ణునిజీవితము

సీ.

దీపితశ్వేతాంతరీపప్రతీకాశ
                       వజ్రసంస్థాపితవప్రవలయ
యరుణాశ్మవైఢూర్యహరినీలగోమేధి
                       కాపూర్ణచతురుచ్చగోపురాఢ్య
ప్రత్యగ్దిశాసాగరభ్రాంతికృత్ప్రాగ
                       వాగుత్తరదిశానువర్తిఖేయ
యభితశుకచ్ఛదాత్యచ్ఛసచ్చాయనీ
                       రంధ్రతరారామరజ్యమాన


తే. గీ.

యజరలావణ్యరూపజనాస్పదంబు
ప్రతిదినోత్సవసేవనాగతసుపర్వ
యానకషణోత్థమణిరజోత్యంతపూర్ణ
రంగవల్లిక ద్వారక రాజధాని.

435