పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

శిర మంటివి కర మంటివి
వర మంటివి హరుఁడు పల్కువచనంబులకున్
ధరలో నిల్కడ గలదే
పరులవలెన్ నేఁడు నిన్ను భ్రమయించెఁ గదా.

423


వ.

అని పలికి దనుజవంచనాకరణచతురుండైన యచ్చక్రి శాంబరీ
విభ్రమంబుఁ గల్పించి దనుజుని శిరంబునం గరం బిడుకొనంజేసిన
వాఁడు భసితంబయ్యె, హరిహరులు సంతసిల్లి రంత.

424

అర్జునుఁడు సుభద్రను గొంపోవుట

క.

చోరులు బ్రాహ్మణసురభులు
ధీరత హరియింప వాటిఁ దెచ్చుటకై గో
త్రారితనూజుఁడు శస్త్రా
గారంబున కరిగి మదికిఁ గడుభయ మొదవన్.

425


వ.

పాంచాలీసహితుండైన యుధిష్ఠిరుం గాంచి గాండీవంబును నక్షయ
తూణీరంబులుం గైకొని యాసవ్యసాచి చోరుల భంజించి నారదముని
కృతమర్యాదాక్రమంబునఁ దీర్థాచరణంబు సేయుచు భిక్షుకవేషంబున
ద్వారక చేరి బలభద్రానుమతంబునఁ దద్గృహంబున కేఁగి.

426


క.

ఒకసొగ సొకసింగారం
బొకవయ్యారంబు మెఱయ నొప్పులకుప్పై
మకరాంకుశస్త్ర మనఁగాఁ
బ్రకటశ్రీఁ దగు సుభద్ర భక్తిం గొలువన్.

427


క.

కని మోహాంబుధిఁ దేలుచు
ననురూపార్థుండు పార్థుఁ డాబాలికపై
మన మువ్విళ్ళూరం బై
కొన సమయాంతరము గాచికొనియుండెఁ దగన్.

428


వ.

ఇట్లుండి కృష్ణానుమతంబున సుభద్రం దోడ్కొని నిజపురంబునకుం
జనియె నంత నొక్కనాఁ డుత్సవంబున నున్న మునులు మూర్తిత్రయ
పరీక్ష సేయ భృగువు నంపిన.

429