పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఇట్లు చేసి ఋషులవలన నేతత్పాపనిష్కృతి తీర్థాచరణంబున నగునని
విని తదాచరణోన్ముఖుండై యుండె నంత ఋషియాగవిఘ్ననిరాసంబు
సేయం దలంచి.

399


క.

పల్వలు కృతరిపుశోభిత
పల్వలు నిల్వలునియనుజు బలుఁ డుగ్రుండై
పల్వగలం బోరి తలఁచి
వల్వగలం గొట్టి నేలపైఁ బడఁద్రోచెన్.

400


వ.

ఇట్లు పల్వలుం ద్రుంచి కౌశికీసరయూప్రయాగగోమతీగండకీవిపాశా
శోణనదగయాగంగాసాగరసంగమసప్తగోదావరీకృష్ణవేణీపంపాసర
శ్రీశైలవేంకటాచలకాంచీపురరంగధామవృషభాద్రిమధురాసేతు
తామ్రపర్ణుల దర్శనస్నానాదులం గృతార్థుండై నియమంబు మెఱయ
యాగంబు గావించె నంత.

401

కుచేలోపాఖ్యానము

క.

కులసతి దారిద్ర్యంబునఁ
బలవింపుచు నొక్కనాఁడు భర్త కుచేలుం
బిలిచి మనప్రాణబంధుఁడు
గల కృష్ణుఁడు గలుగ లేమిఁ గందఁగ నేలా.

402


వ.

ఉపాయనంబులుగాఁ బృథుకంబులు గొని కృష్ణసాన్నిధ్యంబునకుం జని
పృథుకార్తిఁ దీర్పవే యని పలికిన.

403


ఉ.

ఏలికపై జుగుప్స యొనరించిన చేలము క్షౌరకర్మ మే
కాలములేని శ్మశ్రువులు కన్నుల దూషికశుష్కచర్మమై
పాలినమేను గల్గి తనపై కమలాగ్రజ నిల్వఁ బూర్ణల
జ్జాలసుఁడై మురారికడ కాద్విజవర్యుఁడు వచ్చువేళలన్.

404


తే. గీ.

వేత్రహస్తులఁ గనుఁగొని వెఱచు భద్ర
దంతిఘీంకారములు విని తల్లడించు
నెలమితో నెవ్వ రెదురైన నితఁడు ప్రభుఁ డ
టంచు దీవించు నున్ముగ్ధుఁ డగుచు నతఁడు.

405