పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

శరకుంతముసలపట్టిస
కరవాలగదాస్త్రశస్త్రగణకోటులచే
సరిఁ బోరిరి జయకాంక్షా
పరులై బ్రహ్మాండమెల్లఁ బటపటఁ బగులన్.

360


వ.

అప్పుడు.

361


క.

బాణసుతుఁ డేఁగెఁ దనకుం
బ్రాణము దక్కించుకొని కృపాణము జారన్
బాణుఁడు వణఁకుచు సాత్యకి
బాణంబుల నిలువలేక భంగము నొందెన్.

362


క.

ముసలధరుభయము కడువె
క్కసముగఁ గుంభాండగూఢకర్ణులు చని రా
యసమానఘోరసంగర
వసుధయు నేరికిని జూడ వశమే యెదుటన్.

363


తే. గీ.

హరుఁడు బ్రహ్మాస్త్రముఖ్యదివ్యాస్త్రవితతి
శౌరిపై నేయ హరి వాని సంహరించి
జృంభణాస్త్రంబు పైనేయ శంభుఁ డంత
నుక్షకకుదాంతరంబుపై నొరిగి సోలె.

364


వ.

తత్సమయంబున బాణుం డెదిరి.

365


తే. గీ.

పంచశతబాహువులను చాపములు దాల్చి
శాతసాయకములు వైవ శౌరి తచ్ఛ
రాసనంబులు ద్రుంచి రథ్యములు నొంచి
సారథి హరించి యతని తేజం బణంచి.

366


వ.

నిలుచునెడ.

367


క.

కోటర పరిశుష్కవదన
కోటరయై సుతునిఁ గ్రావఁ గ్రొమ్ముడి వీడన్
శాటంబుజార భీతి ని
శాటంబు రణస్థలాగ్ర మప్పుడు చొచ్చెన్.

368


వ.

బాణుండు భయంబున నిజపురంబు సొచ్చె నంత హరుండు త్రిశిరఘోర
మూర్తియగు నుగ్రజ్వరంబుఁ గల్పించిన దాని నతిశీతలజ్వరంబు
గల్పించి హరి హరించె నంత.

369