పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


జాలికుల్ తెచ్చి తచ్ఛంబరదైత్యు మ
                       హాననంబున కపు డప్పగింప
యడబాల లంతట నామీను శోధింప
                       నం దుదయించిన యట్టి బాలుఁ


తే. గీ.

గాంచి మాయావతీసమాఖ్యన్ వసించు
రతికి నెఱిఁగింప నంత నారదుఁడు తత్క్ర
మంబుఁ దెలుపంగఁ దెలిసి శంబరుని నడిగి
చెలువ రతి తత్కుమారుఁ బోషించుచుండ.

333


క.

చక్కఁదన మెమ్మె చూపఁగఁ
జక్కిలిగిలిగింత గొల్పె జవరాండ్రకుఁ దా
నక్కొమరుండు మరుండగు
దక్కినవారలకు నిట్టి తనుకళ గలదే.

334


క.

చిలుకుల వాలుంబువ్వుల
యలుగులె నాబాలువిల్లు ననిలరథంబున్
గల జగజో దితఁడని మదిఁ
దలఁచిరి శంబరుఁడు దక్కఁ దక్కినజనముల్.

335


చ.

పలుకులలోన మోహములు పైకొని నవ్విన ముద్దునవ్వులున్
వలపులు వెల్లిగా మెఱయు వాలుఁగనుంగవ బొల్చు చూపులున్
గులికెడు బాహుమూలరుచి గుబ్బచనుంగవ చాయ వేఱులై
కలయఁగ నారతిప్రమద కంతునిఁ బైకొనియెం బ్రియంబునన్.

336


వ.

అప్పు డప్పువ్వులవిలుతుండు రతివలనఁ దద్వృత్తాంతంబంతయుం
దెలిసి సర్వశత్రువినాశినియైన మహామాయావిద్యం గాంచి.

337


క.

శంబరదైత్యసముద్భట
శంబరయోదారఘోరశాతాసితలన్
శంబరపోతమువోలెన్
శంబరనిధిశాయిసుతుఁడు చయ్యన నోర్చెన్.

338


తే. గీ.

అంత రతి గగనాద్యంబునందుఁ బతియుఁ
దానుఁ జని ద్వారకాపురోత్తంసహంన
మండలోద్దండమాణిక్యమండలప్ర
కాండసౌధాగ్రమున నిల్చి కాననయ్యె.

339