పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

రాజీవధ్వజుఁ గని వర
తేజము రుచిరాంగనవ్యదీప్తియు ధవళాం
భోజములఁ బోలు కన్నులు
రాజిల్లఁగ శౌరి యనుచు రమణులు గదియన్.

340


ఆ. వె.

ఆత్మ చల్లనగుట కానందబాష్పాంబు
ధార లుప్పతిల్లఁ దగఁ గుచములు
చేపి పాలు గురియఁ జెంత రుక్మిణి నిజ
సఖులుఁ దానుఁ గొంత సంభ్రమించి.

341


క.

జటిలాలకయై గంగా
తటినీతటి నెట్టితపముఁ దగఁ జేసెనొ నేఁ
డిటువంటికొడుకు గాంచిన
కుటిలాలకభాగ్యరేఖకుం గడ గలదే.

342


వ.

అని పలుకుచున్న నారదునివలనం దత్పూర్వవృత్తాంతం బంతయు
నెఱింగి కృష్ణుండు తత్సమీపంబునకుం జనుదెంచె వసుదేవదేవకీబల
రాములు తద్విధం బెఱింగి ప్రమోదాన్వితు లైరి. భోజకన్యక తనకు
వందనంబులు సేయు సుతునిం గోడలి నక్కునం జేర్చి చక్కనెత్తి
బహూకరించె నంత వారలందఱును నిజస్థానంబులకు జను
నట్టియెడ.

343


క.

ఆమ్నాయనికాయాజ
స్రామ్నాత సుకీర్తిశాలి యగు హరికి లస
ద్యుమ్నరుచికి రుక్మిణికిఁ బ్ర
ద్యుమ్నుఁ డతఁడు తిరుగఁ గలిగి యుత్సవ మొసఁగెన్.

344


వ.

అంతఁ బూర్ణయౌవనకళాభివృద్ధిగాంచిన ప్రద్యుమ్నకుమారునకు.

345


క.

రుక్మి తనయ నొసఁగెద నన
రుక్మాంబరుఁ డాప్తజనవరులు బాంధవులున్
రుక్మిణ్యాదులు రాఁగా
రుక్మరథం బెక్కి తగుసిరుల్ దళుకొత్తన్.

346


వ.

కుండినపురంబునకుం జని రుక్మినందనం బ్రద్యుమ్నునకు వివాహంబు
చేసినపిమ్మట.

347