పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

కరు లొకతొమ్మిదివేలును
గరివరశతగుణములైన ఘనరథములు ద
ద్వరరథశతగుణహయములు
హరి శతగుణభటుల నృపతి యల్లున కొసఁగెన్.

325


వ.

మఱియుఁ బదివేలుధేనువులును సకలభూషాభిరామరామాసహస్ర
త్రయంబును నగ్నజిత్తు తనకు నొసంగం గైకొని నాగ్నజితిసహితుండై
ద్వారకానగరంబుఁ ప్రవేశించె నంత.

326


క.

భద్రయను మేనమఱఁదలి
భద్రగుణాన్వీత దివ్యభామాజనశుం
భద్రత్నముఁ గైకేయిన్
భద్రవిమర్దనుఁడు శౌరి పరిణయ మయ్యెన్.

327


వ.

అంత.

328


క.

మద్రనృపాలుసుతన్ రుచి
మద్రత్నము లక్షణన్ సమస్తారిమనో
మద్రాజగణము చూడ స
మద్రక్షకుఁ డట వరించె మహితోత్సవుఁడై.

329


వ.

మఱియుం బాండవులఁ జూడ నింద్రప్రస్థపురంబునకుం జని అర్జున
సహితుండై వేఁటలాడుచుఁ గాళిందీపులినప్రదేశంబుననున్న కాళింది
కన్యను వివాహంబై ద్వారావతికి వచ్చె నిట్లు.

330


తే. గీ.

భవ్యయగు రుక్మిణియును జాంబవతి సత్య
భామ కాళింది మిత్రవిందా మృగాక్షి
నాగ్నజితి భద్ర లక్షణా నలినముఖియు
ననఁగ నెనమండ్రు ప్రియభార్య లగుచు నుండ.

331


వ.

సంతోషంబున శౌరి యుప్పొంగుచుండ నంత నొక్కనాఁడు.

332


సీ.

భోజకన్యాగర్భమున దర్పకుండు ప్ర
                       ద్యుమ్నాభిధానంబుతో జనింప
శంబరుఁ డరియని జలధి వైవ నతని
                       నొకమీను మ్రింగ మహోగ్రశక్తి