పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నెడ హరి సంతసిల్ల సత్యభామ యిప్పుడె నరకాసురుని ఖండించెద
మదీయయుద్ధచాతుర్యంబు చూడుమని పల్కి వీరశృంగారరసనిధియై
కుచంబులపై జారు పయ్యెదకొంగు పదిలంబుగా సవరించి కీలుగంటు
బిగువుగా ముడిచి కరంబున శరచాపపల్లి మెఱయ జన్యసన్నాహంబు
మెఱయనున్నయెడ.

309


క.

ఆచూపుఁగోపు సొగసును
నాచాపాకర్ణనంబు నాయుద్ధకళా
వైచిత్రియుఁ జిత్రంబై
గోచర గోచరుల కపు డగోచర మయ్యెన్.

310


ఆ. వె.

చక్రధారుఁ ద్రుంచెఁ జక్రి దానవలోక
చక్రవర్తి శిరము చదల నమర
చక్రమెల్లఁ జూచి సంతోష మంద నా
చక్రవాళధరణిచక్రమద్రువ.

311


వ.

అప్పుడు మణికుండలంబులును వైజయంతియు వరుణదత్తసితాతపవా
రణంబు నొకమహాదివ్యరత్నంబు నొప్పగించి భూదేవి మురారాతిం
బొగడి మ్రొక్కి.

312


క.

భగదత్తుండను తత్సుతు
నగణీయదయావిలోకనామృతవృష్టిన్
జగదేకపతీ! ప్రోవుము
తగు నాశ్రితరక్షణంబు ధర్మాత్ములకున్.

313


వ.

అని మఱియు నుతించిన యాభూదేవికిం బ్రసన్నుండై భగదత్తునకుఁ
దద్రాజ్యాధిపత్యం బొసంగి.

314


క.

కాంతులవింతల దగు చౌ
దంతుల వరరూపవిభవధన్యాకృతులన్
గాంతలఁ బదారువేవుర
నంత మురాంతకుఁడు పంపె నా ద్వారకకున్.

315


వ.

అప్పుడు కృష్ణుండు సత్యభామాసహితుండై గరుడాధిరోహణంబు
మెఱయ నమరావతికిం జనిన సురాధినాథుం డెదుర్కొని సంభ్రమించి
యింద్రునినగరు ప్రవేశించి యందు.

316