పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

హరి ప్రసన్నాత్ముఁడై యతనిఁ గౌగిటఁ జేర్చి
                       యపవాద మొదవిన నరుగుదేర
వలసె శ్యమంతకాహ్వయరత్న మిచ్చినఁ
                       దదపవాదము నాకుఁ దప్పు ననిన
నాదివ్యరత్నంబు నాత్మజారత్నంబు
                       నతఁ డొసంగఁగఁ బురి కరుగుదెంచె
గుహలోనఁ దానుండి గురు తెఱుంగక వచ్చి
                       ప్రలపించి తిరిగెడు బంధువర్గ


తే. గీ.

పౌరవర్గ సుధీవర్గ పార్థివేంద్ర
వర్గ మునివర్గములు మెచ్చ వాసుదేవుఁ
డమ్మణి యొసంగె సత్రాజితాఖ్యునకు ని
జాంతరంగమ్మునందు హర్షాబ్ధి విరియ.

305


తే. గీ.

అతఁడు లజ్జించి యపరాధ మణఁచికొనఁద
లంచి యారత్నమును సుకళాకలాప
యైన యాసత్యభామ ప్రియాశయముస
వచ్చి సద్భక్తి కానుక యిచ్చె హరికి.

306


వ.

అప్పుడు కృష్ణుండు సత్రాజిత్తునకు మణి మరల నిచ్చి సత్యభామం బరి
గ్రహించె నంత నరకాసురకారాగృహగృహీతలైన రాజకన్యలు పదాఱు
వేవురును శౌరికి నిజవృత్తాంతం బెఱుకపడంజేసిన సంభ్రమంబు మెఱయ
నాహరి సత్యభామాసమన్వితుఁ డగుచుఁ జతురంగబలయుతుండై తత్పు
రంబునకుం జనిన.

307

నరకసంహారము — పారిజాతాపహరణము

క.

అప్పుడు భౌముఁడు మదముల్
చిప్పిలు సింధురము నెక్కి క్షితి నసిదీప్తుల్
కుప్పలుగాఁ దద్భువన క
కుప్పలల భుజుల్ భుజింపఁ గ్రోధోద్ధతుఁడై.

308


వ.

ఎదిరిన యా కృష్ణుండును నతనిపైఁ గవిసి యనేకదివ్యబాణంబు లేసిన
నాధరానందనుండును నా కృష్ణుని బాణంబులం .................. నట్ల
యిరువురు మచ్చరంబు లెచ్చ బహువిధశస్త్రాస్త్రఘాతంబు లొదవఁ బోరు