పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

హలి వానిం దురమున నా
హలాహళిఁ బట్టి వధింపఁబూన నప్పుడు కృష్ణుం
డలఘుతరప్రియభాషల
వలదని వారింపఁ గార్యవశమున విడిచెన్.

242


వ.

జరాసంధుండు యుద్ధసన్నద్ధుండై యున్నయెడ నారదుండు తెలిపిన.

243


ఆ. వె.

కాలయవనుఁ డమితకల్పితరిపునాయ
కాలయవనుఁ డంతఁ గంసవైరి
పురముఁ జుట్టుకొనిన హరి నిరాయుధవృత్తి
నెదుట నిల్చి కడకు నేఁగునంత.

244


సీ.

తేజితాశ్వము నెక్కి ధీరుఁడై యాకాల
                       యవనుండు చనుదేర నంటకుండ
వాయువేగమునఁ బోవఁగ వాడు నేతేర
                       నంత మనోవేగ మడర వెడలు
వెడలు డగ్గరు వానికడ నదృశ్యత నొందు
                       నయ్యదృశ్యత మాని యార్చి పేర్చు
వెఱచునో యన నిల్చు విఱిగినయ ట్లేఁగు
                       వలసిన యట్లుండు నడలి దూరు


తే. గీ.

నపుడె బయలెక్కు నగుఁ గేరు నరసి చూచుఁ
గఠినపాషాణకుశకంటకప్రరోహ
కాపథంబునఁ గోమలక చులవిజిత
చరణముల నడచుట కోర్చి చక్రధరుఁడు.

245


తే. గీ

హరి యొకనగంబుగుహ దూర నంత వాఁడు
గడిమిఁ జనుదెంచి కృష్ణునిఁ గానలేక
యందు నిద్రితుఁ డగు ముచికుందుఁ దాఁకి
భస్మమైపోయె ఖేచరప్రతతి యలర.

246


వ.

అంత.

247