పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అతిమానుష మతిదివ్యం
బతిలోకము నతివిచిత్ర మతిగూఢతరం
బతిసమ మతివైభవగుణ
మతని మహిమ మరయ నజహరాదులవశమే.

226

శ్రీకృష్ణుఁ డుద్ధవుని గోపికలకడ కంపుట

వ.

అని యందఱు నెన్నందగు నమ్మహానుభావుఁ డొకనాఁ డుద్ధవునిం
బిలిచి యేకాంతంబున నిట్లనియె.

227


క.

తనువుం బ్రాణము దైవము
దనువున్ హృదయంబు పరమతత్త్వము నేనే
యని నమ్మి గోపకామిను
లనఘా! యేమైరొ వారి నరయఁగ వలయున్.

228


క.

ఏనమ్మిక గలవారల
మానక రక్షింతుఁ జాల మన్నింతు ననున్
మానవతులఁ జూడని యా
మానవతుల కేమి కొఱఁత మహితార్థంబుల్.

229


వ.

అని యనిచిన నతండు నందవ్రజంబున కరిగి నందునియింట నద్దినంబెల్ల
నధివసించి; మఱునాఁడు గోపికలం బిలిపించి కృష్ణసందేశంబు విని
పించిన వారలలోఁ బ్రౌఢయగు గోపకన్యక యొక్కర్తు ప్రాంతభృంగం
బుతోఁ గృష్ణానురాగద్యోతకంబగు నర్థాంతరంబు వొడమ నిట్లనియె.

230


సీ.

బృందావనాంతరామందవంజులమంజు
                       కుంజఖేలామనోరంజనంబు
యమునాతరంగిణీహ్రదఫుల్లహల్లక
                       మధ్యసంక్రీడాసమగ్రలీల
వ్రజభామినీమణిప్రకరధమ్మిల్లాగ్ర
                       కుందసేవంతికాబృందకలన
రాధావిలాసినీరమణీయమాలతీ
                       చారుశయ్యాతలాస్పందనంబు