పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

పద్మినీప్రియుఁ డయ్యుఁ జాపలముఁ బూని
యినుఁడు నిస్తేజుఁడై క్రుంకె నేమి చెప్ప
నపరకాంతాశఁ దిరిగిన యట్టివాఁడు
ధరణి వెలయునె యుద్దామధాముఁడైన.

214


తే. గీ.

ఘోరచాణూరమల్లోగ్రఘోషశక్తి
నంబరంబెల్ల నట్లౌనె యనుచు ధాత
తఱచు వెండిచీలలు తాము తాచినట్లు
తారకాజాల ముదయించె దట్టమగుచు.

215


సీ.

దనుజారికలహభోజనమహాధృతిసమా
                       యాతప్రహర్షి దేవర్షి యనఁగఁ
జాణూరమురళికానంచలద్భేతాళ
                       భర్త చిమ్మిన రౌప్యపాత్ర మనఁగఁ
గంసశిరఃక్షిప్తకాలదండంబున
                       బెళకి నిక్కిన వజ్రమలయ మనఁగ
జన్మదేశస్పృహాసంధావదుదయాద్రి
                       విశ్రాంతి హరివాజివిభుఁ డనంగఁ


తే. గీ.

గామినీకాముకానీకకలితహృదయ
కల్పితానేకసంకల్పకల్పశాఖి
నిర్మలస్ఫూర్తి గైకొని నిలిచె ననఁగ
సిరి దనరె నప్పు డుదయించె శీతకరుఁడు.

216


వ.

అంత ప్రభాతం బగుటయు.

217


క.

కెంజిగురుజొంపములతో
మంజులరుచి దొరయు గుజ్జుమావియపోలెన్
రంజిల్లె నుష్మకరుఁడు స
మంజసతేజంబు చేయ మాధవుఁ డలరెన్.

218


వ.

అప్పుడు కంసుం డొడ్డోలగంబై యుండ రామకృష్ణులు యుద్ధరంగాభి
ముఖులై చనునెడ.

219