పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శంఖచూడుం డనఁజాలు యక్షేశ్వర
                       భటుఁడు దుర్ఘటమదోద్భటుఁడు వచ్చి
యోగబలంబున నుత్తరంబునకుఁ దో
                       డ్కొనిపోవ హా కృష్ణ! గోపగుణగ


తే. గీ.

భీర యను తత్సతుల విడిపించె శౌరి
యెచట చొచ్చిన విడువక యీడ్చి శౌరి
పూని దృఢముష్టిఁ జెండాడి వానిమౌళి
నున్నరత్నంబులెల్ల నింపూనికొనియె.

184


వ.

ఇట్లు గైకొని యున్నంత.

185


క.

వాహంబై ఖరధురవా
ర్వాహంబై కేశిదైత్యవర్యుఁడు రాఁ ద
ద్దేహంబు విరిచె నిస్సం
దేహంబున మింట సకలదివ్యులు పొగడన్.

186


వ.

అంత.

187


క.

వృషభాసురబల మణఁచెన్
వృషభాసురబలము నిలిపె వినివేశితగో
వృషభుఁడు సంరక్షితగో
వృషభుఁడు హరి శౌర్యధైర్యవీర్యస్పూర్తిన్.

188


సీ.

అవికలహృదయులై యవి కళలం గొంద
                       ఱవిపాలకత్వంబు నంది కొంద
రవిచారులై వనాభ్యంతరసీమల
                       నాటలాడుచునున్నయపుడు చేరి
మయతనూజుం డతిమాయావి యని మూర్తు
                       లైన గోపాలుర నవహరించి
గుహలోన నిది హత్తుకొన నొకశిల వైచి
                       మరలి వచ్చిన జూచి మాధవుండు


తే. గీ.

హస్తములఁ బట్టి బిర బిరఁ వార్చి త్రిప్పి
కొండపై వేయ వ్రయ్యలై కూలె వాఁడు
కురిసె వింతగ మందారకుసుమవృష్టి
తోయనిధు లుబ్బె దివ్యదుందుభులు మ్రోసె.

189