పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అప్పుడు గోపాలకుల విడిపించి తెచ్చి యచ్చక్రి సుఖంబున్నయెడ.

190


శా.

సారజ్ఞానకళాగుణైకఖని యౌశ్వాఫల్గుఁ డక్రూరుఁ డా
త్మారాముం బొరిఁజేరి మ్రొక్కినది బ్రహ్మానందమున్ దెల్పు దృ
ఙ్నీరేజంబుల బాష్పముల్ దొరుఁగఁగా నీరంధ్రరోమాంచుఁడై
సారం బేర్కొని గద్గదస్వరము మించన్ సన్నుతుల్ సేయుచున్.

191


క.

వనజాతోద్భవముఖ్యులు
గననేరని నీదుపాదకంజాతము లేఁ
గని ధన్యుఁడ నైతిన్ నా
జననంబు ఫలించెఁ దండ్రి! శౌరి! మురారీ!

192


ఆ. వె.

స్వామి మీకటాక్షకామధేనువు గల్గ
నేమి సంభవింప దీశ! దేవ
తాంతరముల సాధనాంతరములును మం
త్రాంతరములు నేల యరసిచూడ.

193


వ.

అని నుతియించి రామకృష్ణుల మధురకుం దోడ్కొని యేఁగుచు యమునా
తీరంబునం దరుచ్ఛాయ నమ్మహాత్ముని నిలిపి యక్రూరుండు తద్యమునా
జలంబులం గ్రుంకినం దన్మధ్యంబున.

194

అక్రూరుఁడు యమునాజలమున రామకృష్ణులఁ గాంచుట

తే. గీ.

స్ఫటికనీరదవర్ణుల శ్యామపీత
రుచిరపరిధానుల విచిత్రరూపతాళ
గరుడకేతనుల శుభప్రకాశనిధుల
రామకృష్ణులఁ గాంచె సారజ్ఞుఁ డతఁడు.

195