పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అంత నార్చికగాధికసామికస్వరాంతరౌడువషాడవసంపూర్ణంబు
లగు సప్తస్వరంబుల శ్రుతిజాతిభేదంబు లెఱింగి మూర్ఛనావిశేషంబున
గ్రామత్రయరాగంబులు పరిసాధించి తత్తద్వేళానుసారంబున గ్రహ
సన్యాసంబులు పరిశీలించి మద్రకాదిగీతంబులు విదారిప్రమాణంబున
చతురశ్రత్రిశ్రమిశ్రతాళవిశేషంబులఁ బాతకళాకళాకలాపంబు లుగ్గ
డింపుడు మార్గదేశి వివిధంబుల పాదకటిపార్శ్వబాహుహస్తవక్షద్వక్ష(?)
గ్రీవాధరనానేకా(?)భ్రూశ్రవణనేత్రాంచల్లలాటిశిరోముఖితత్క
రణంబుల సాంగికసాత్వికమానసికాభినయంబుల మెఱయించి భూత
వ్యోమచారి(?) గతుల జొక్కింపుచు నంగనాద్వయమధ్యమాధవ
మాధవద్వయమధ్యగాంగనాశోభితమండలంబైన రాసమండలంబునం
గృష్ణగోపకన్యలు లాస్యంబు సలిపి రపుడు.

172


ఆ. వె.

ఒకతె చెక్కు నొక్కి యొక్కతె ముద్దాడి
యొకతెఁ గౌఁగిలించి యొకతె మెచ్చి
యొకతె కూఁత యిచ్చి యొక్కతె మన్నించి
రాసకేలి గోపరత్న మలరె.

173


తే. గీ.

కోటిసూర్యప్రకాశుఁడై కోటిమదన
కోమలోజ్వలమూర్తియై కోటిచంద్ర
శుభకళామోహనుండునై సొంపు మెఱయు
నచ్యుతుని జూచి గోపకన్యాచయంబు.

174


వ.

బహువిధక్రీడలఁ గృష్ణునితో నలరుచు నుండునంత.

175

నందుఁ డేకాదశి నుపవసించుట

మ.

పతితక్రూరనిషాదకీటకమహాపాపఘ్న మార్యస్తుతం
బతిలోకం బనవద్య మప్రతిమ మాద్యం బైహికాముష్మిక
స్థితినిర్వాహక మవ్రతప్రళయవిచ్ఛేదక్రియామూల మా
క్షితి నేకాదశి యంచుఁ దా నుపవసించెన్ నందుఁ డానందియై.

176


వ.

అంత ద్వాదశినిమిత్తస్నానంబు సమయంబు నొనర్ప వరుణదూతలు
నందునిం గొనిపోవ నిజప్రభావంబున హరి మరలం దెచ్చె నపుడు.

177