పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చల్లిన స్తనకలశకుంకుమారుణోదకంబులు గ్రమ్మ ధాతుమయనిర్ఝ
రాంబురక్తంబగు నంజనాచలంబు డంబు వహించె. ఇట్లు బహువిధ
జలక్రీడలు గావించి తత్కేలి చాలించి తత్తటంబునకుం జనుదెంచి
చలువలు గట్టి చిత్రమణిభూషణంబులు ధరియించి శీతలకుసుమ
మాల్యంబులు సవరించి యుచితవిహారంబుల వెలయుచు నుండి
రంత.

149


తే. గీ.

కృష్ణుఁ డన్నది గోపికాకేళిపరత
నోలలాడంగఁ జూచి నోరూరి యటుల
పద్మినులతోడఁ గూడి యప్పాటనవర
జలధిఁ జేరినకైవడిఁ జనియె నినుఁడు.

150


తే. గీ.

అట్లు పద్మాప్తుఁ డపరాబ్ధియందుఁ గ్రుంగె
నతనివెను చను నవ్యరక్తాబ్జలక్ష్మి
వోలె సంధ్యారుణప్రభాలీల మెఱసె
గగనకుంభీంద్రసింధూరకలన వొసఁగ.

151


తే. గీ.

అపరవారాశిఁ గసరెత్త నద్భుతముగఁ
దరణి మునిఁగిన తద్వనుతతులు దొరక
తేజము వహించె నవు డన్నిదిక్కులందు
హేతిమంతుండు జగమెల్ల నెన్నికొనఁగ.

152


సీ.

ఆకాశగంగాజలాంతరమ్ములయందుఁ
                       గొమరారు పేనఖండము లనంగ
నభ్రగజంబు దివ్యవిమానవితతి వా
                       రక రాయ రాలు హేమాంబు లనఁగ
నర్కుండు చెరగొని యపరాద్రి విడువంగ
                       వచ్చిన నవకైరవంబు లనఁగ
నలరువిల్తుండు సవ్యాపసవ్యముల ల
                       క్ష్యము వేయు కుందబాణము లనంగ


తే. గీ.

సమయమిషఘనఖరకరస్వామి విదళి
తాంధకారగజేంద్రకుంభాంతరాళ
కీర్యమాణసమగ్రమౌక్తికము లనఁగఁ
దార లుదయించె రుచిరజితారు లగుచు.

153