పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నెమ్మె మెఱయననునే యలవాటునఁ
                       గొమ్మలచే సుమగుచ్ఛము వాటున
మది చెదరకు సతి మరునసి వారికి
                       మదవతు లాడిన మాటల వారికి
హరిణవిలోచన యనుపమరాగము
                       పొరిఁ బొరి నిలిచెం బుష్పపరాగము
జగములు మెచ్చని శాఖల చాయల
                       నిగిడిన పుప్పొడి నిద్దపుఁజాయల
నని సరసోక్తుల నందఱ నాడుచు
                       వినుతలాస్యముల వెలయగ నాడుచుఁ
జెలువలు మెరసిన శృంగారంబునఁ
                       జెలువానిరి తను శృంగారంబున.

146


వ.

తద్వనీకేళీపరిశ్రాంతలై యున్న కాంతలుం దానును జలక్రీడ లొన
రింపంబూని యమున డాసె నప్పుడు.

147


తే. గీ.

శ్యామ నిన పుత్రిఁ దగిలి మాస్వామి మమ్ము
విడుచునో యని భయమున వెలఁదు లతని
కరము లంగుళులును మేను కటియుగమును
బాహువులు మూఁపు వదలక పట్టిరపుడు.

148


వ.

అంతకుమున్న భూషణాదులు తత్తటంబునం బెట్టి చదురుకావులు ధరి
యించి కనకమయశృంగంబులు కరంబుల వహించి రత్నమయసోపా
నంబుల వెంబడి నొయ్యన హరితోడం జని యమునాహ్రదంబుఁ జొచ్చి
కృష్ణభుజశాఖలం బోయి తదీయోత్తుంగతరంగంబుల విహరించుచుఁ
గాంతానిచయం బన్యోన్యకుచకచంబులు గురులు చేసి వాసిగాఁ బుప్పొ
డులు గ్రమ్ము తమ్మిరేకులచాలు తేనెజాలు కొసంగుప్పిన జక్కపల
కవల తుమ్మెదల పొదుల యరులవైవం దొడంగి రవిసముల్లోలకల్లోల
పాలికాసంచలత్పద్మాంతరాళచక్రవాకచంచరీకంబులు కడకుం
జనియె. [1]కొమ్మలు చిమ్మిన గ్రోవులం జిమ్మిన మకరందంబునఁ గాంతా
కరక్షిప్తమృణాళంబులును నంగనల యధరంబుల బాహువులపై నంటి
నిజాప్తభావంబు వెలయించెనో యన మెరసెన్ గృష్ణుఁడు గోపికలు

  1. కొమ్ములు