పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

నతఁడు వైష్ణవవీరసింహాసనస్థుఁ
డుభయవేదాంతవిద్యామహోన్నతుండు
శుద్ధసాత్వికధర్మప్రసిద్ధకీర్తి
శాలి కంచెర్ల కేశవాచార్య మౌళి.

21


వ.

తద్వంశంబున.

22


మ.

సిరులన్ సద్గురుశేఖరుం డనఁగ మించెన్ గొండమాచార్యుఁ డా
హరియే యీఘనుఁ డంచు శిష్యవరు లాత్మాయత్తులై కొల్వఁగా
వరవేదాంతరహస్యవేదియు భరద్వాజర్షిగోత్రాబ్ధిభా
సురశీతాంశుఁడునై ప్రసిద్ధి వెలసెన్ సూరులే ప్రశంసింపఁగన్.

23


వ.

ఆమహాగురుశిఖామణి యొక్కనాఁడు స్వప్నంబున నన్నుఁ గరుణించి
నారదీయసాత్వికపురాణంబు లోకోపకారార్థంబుగా నాంధ్రభాష
రచించి శ్రీకృష్ణాంకితంబు సేయుమని యానతిచ్చిన మేల్కాంచి కృష్ణ
భగవంతుని మనంబున నిడుకొని రచియింపంబూనితిఁ దదవతారక్రమం
బెట్టిదనిన.

24

మధురాపురవర్ణన

సీ.

శ్రీరాజవశ్యమై శ్రీరాజవశ్యమై
                       యఖిలలోకముల విఖ్యాతిఁ గాంచి
కల్యాణధామమై కల్యాణధామమై
                       యఖిలలోకముల విఖ్యాతిఁ గాంచి
సుమనోభిరామమై సుమనోభిరామమై
                       యఖిలలోకముల విఖ్యాతిఁ గాంచి
సత్కళాపూర్ణమై సత్కళాపూర్ణమై
                       యఖిలలోకముల విఖ్యాతిఁ గాంచి


తే. గీ.

ప్రబలెఁ భ్రాంతాభ్రశుభ్రతరంగిణీత
రంగరంగన్మహాఫేనరాజరాజి
తాజరపయస్సుధాలేపనాంచితోచ్చ
గోపురశ్రీల నగు మధురాపురంబు.

25